'సాహోకి' సెన్సార్ సమస్య..?

Published : Aug 21, 2019, 03:58 PM IST
'సాహోకి' సెన్సార్ సమస్య..?

సారాంశం

అభిమానులే కాదు యావత్ సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్న సాహో సెన్సార్ పూర్తి చేసుకున్నట్టుగా తాజా అప్ డేట్. నిర్మాతలు ఇంకా ధ్రువీకరించలేదు.   

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'సాహో' మేనియా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని సమాచారం. కానీ నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా 'ఏ' సర్టిఫికేట్, చెప్పిన మార్పులు చేసే యు/ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పినట్లు టాక్. కట్స్ లేకుండా 'ఏ' సర్టిఫికేట్ గనుక తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. 18 ఏళ్లలోపు పిల్లలు అప్పుడు సినిమా చూడడానికి ఉండదు.

ఇది కచ్చితంగా సినిమా కలెక్షన్స్ మీద ప్రభాస్ చూపిస్తుంది. అలా కాకుండా 'యు/ఏ' ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందుకే కట్స్ మ్యూట్స్ లేకుండా యు/ఏ వచ్చేలా  ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.

సినిమా రిలీజ్ కి మరో తొమ్మిది రోజులు మాత్రం గడువు ఉండడంతో ఇదో సమస్యగా మారింది. సెన్సార్ కి సంబంధించిన అప్డేట్ ఈరోజు లేదా రేపటిలో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా నిడివి 2 గంటల 52 నిమిషాలు ఉందనే టాక్ ఉంది. ఫైనల్ కట్ లో ఏమైనా తగ్గించారేమో చూడాలి.  ప్రస్తుతానికైతే అలాంటి సూచనలు కనిపించడం లేదు!

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు