చిచ్చుపెట్టడంలో సక్సెస్‌ అయిన `బిగ్‌ బాస్‌`.. కెమెరా కోసమే అంటూ ఇనయాపై గలాటా గీతూ షాకింగ్‌ కామెంట్..

By Aithagoni RajuFirst Published Sep 20, 2022, 11:33 PM IST
Highlights

 `బిగ్‌ బాస్‌` మొత్తంగా ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెడుతున్నాడు.  రెండు వారాలు సైలెంట్‌గా ప్రశాంతంగా ఉన్న హౌజ్‌లో రచ్చ లేపుతున్నారు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 6(Bigg Boss Telugu 6) మూడోవారంలో హీటెక్కిపోతుంది. హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఇచ్చిన స్ట్రోక్‌కి ఇంటి సభ్యులంతా రెచ్చిపోతున్నారు. తమలోని కసిని బయటకు తీస్తున్నారు. రెండు వారాలు సైలెంట్‌గా ప్రశాంతంగా ఉన్న హౌజ్‌లో రచ్చ లేపుతున్నారు.  బిగ్‌ బాస్‌ మొత్తంగా ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మూడో వారం నామినేషన్ల ప్రక్రియ నుంచే చిచ్చు రగిల్చగా, ఇక మంగళవారం ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ లో మరింత చిచ్చు పెట్టాడు. బూతులు తిట్టుకునే స్థితికి తీసుకొచ్చాడు. 

17వ ఎపిసోడ్‌(మంగళవారం) గేమ్‌ మరింత హీటెక్కిపోయింది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించే ఇంటి సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. నామినేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చిందో చర్చించుకున్నారు. ఇందులో ఇనయపై, నేహాలపై ఆదిరెడ్డి, గీతూ(Geetu) లు కలిసి రివ్యూలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇనయా(Inaya) పిచ్చిగా అర్థం లేకుండా వాగుతుందంటూ కామెంట్లు చేశారు ఆదిరెడ్డి. కానీ ఇనయ కేవలం హైలైట్‌ కావడం కోసం కెమెరాల కోసం ఆమె ఇలా ప్రవర్తిస్తుందని, స్ట్రాటజీ ప్లే చేస్తుందని గీతూ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు నేహా పై కూడా వీరి కామెంట్లు చేశారు. 

అనంతరం మూడో వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌.`అడవిలో దొంగలు` అనే పేరుతో ఇచ్చిన ఈ టాస్క్ లో అడవిలో కొన్ని వస్తువులుంటాయి వాటిని దొంగలు దొంగిలించి కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని వ్యాపారి వద్ద ఎక్కువ మొత్తాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలి. అదే సమయంలో దొంగలు వస్తువలు దొంగిలించకుండా పోలీసులు అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ యమ రంజుగా సాగింది. ఉత్కంఠతకి గురి చేసింది.

ఇందులో ఆదిరెడ్డి పోలీస్‌ హెడ్‌గా ఉండగా, ఫైమా, రోహిత్‌-మరీనా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య, ఇనయ, రాజశేఖర్‌ పోలీసులుగా ఉన్నారు. ఆర్జే సూర్య, ఆరోహి, వసంతి, రేవంత్‌, నేహా, కీర్తి, అర్జున్‌, సుదీప దొంగలుగా ఉండగా, వ్యాపారిగా గీతా రాయల్‌ ని ఎంపిక చేయడం విశేషం. గేమ్‌ ప్రారంభం నుంచి హౌజ్‌ హీటేక్కిపోయింది. అడవిలో వస్తువులు దొంగిలించేందుకు దొంగలు, వారిని అడ్డుకునేందుకు పోలీసులు శ్రమించారు. ఈ క్రమంలో ఇద్దరూ రూల్స్ బ్రేక్‌ చేశారు. 

అయితే వస్తువులను దొంగించే క్రమంలో శ్రీహాన్‌కి, ఇనయకి గొడవైంది. వాడే ఇదంతా చేశాడంటూ శ్రీహాన్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ఇనయా. దీనికి వాడేంటి వాడు అంటూ శ్రీహాన్‌ రెచ్చిపోయాడు. మంచి మాట్లాడటం నేర్చుకో అంటూ రెచ్చిపోయాడు. ఇనయ కూడా తగ్గకుండా అలానే వాదించడంతో కొడ్తా అంటూ వ్యాఖ్యానించాడు, దీంట్లో జోక్యం చేసుకున్న రేవంత్‌ మరింత బూతు పదాలు వాడాడు. కోస్తా అంటూ ఆయన అనడం దుమారం రేపింది. కాసేపు హౌజ్‌ మేట్స్ ని సముదాయించడానికే సరిపోయింది. ఈ గేమ్‌లో ఆరోహి కాలుకి బలంగా గాయమైంది. 

మరోవైపు వ్యాపారిగా ఉన్న గలాటా గీతా తన హవా చూపించింది. తనకు ఏ రూల్స్ లేవన్నట్టుగా అన్ని చోట్ల తిరుగుతూ, కొన్ని దొంగతనం కూడా చేసింది. దొంగల నుంచి వస్తువులను కొనే విషయంలోనూ బెట్టు చేసింది. రెండు వందలకే మొదటి వస్తువు కొంటా అంటూ రూల్స్ పెట్టింది. మొదట వస్తువులు అమ్మిన శ్రీహాన్‌కి తాను దొంగిలించిన రెండు వస్తువులు ఇచ్చి, వాటినిచేరో ఐదు వందలకు కొనుగోలు చేయడం సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ గేమ్‌ కి సంబంధించిన చర్చే హౌజ్‌లో హాట్‌ హాట్‌గా సాగడం విశేషం. ఎవరు ఏం చేసినా గీతూ మాత్రం తనదైనస్టయిల్‌లో రెచ్చిపోవడం మరో విశేషం. 
 

click me!