డైరెక్టర్ వంశీకి పెళ్లైనా.. ప్రపోజ్ చేశారు.. నటి భానుప్రియ వ్యాఖ్యలు!

By AN TeluguFirst Published May 16, 2019, 5:20 PM IST
Highlights

ఒకప్పటి హీరోయిన్లలో భానుప్రియకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

ఒకప్పటి హీరోయిన్లలో భానుప్రియకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దర్శకుడు వంశీ డైరెక్ట్ చేసిన 'సితార' చిత్రంతో భానుప్రియ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో అన్వేషణ, ఆలాపన వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు భానుప్రియ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ సమయంలో దర్శకుడు వంశీకి, భానుప్రియకి మధ్యలో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వినిపించేవి.

అవి పుకార్లు కావని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది భానుప్రియ. అప్పట్లో దర్శకుడు వంశీ తనను పెళ్లి చేసుకుంటానని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు భానుప్రియ. ఇంట్లో చెబితే దానికి భానుప్రియ తల్లి ఒప్పుకోలేదట. అప్పటికే వంశీ పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆయనతో పెళ్లికి భానుప్రియ తల్లి ఒప్పుకోకపోవడంతో తమ పెళ్లి జరగలేదని చెప్పుకొచ్చింది భానుప్రియ. 

దర్శకుడు వంశీతో బ్రేకప్ తరువాత అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ని వివాహం చేసుకున్నారు భానుప్రియ. వీరికి ఓ అమ్మాయి కూడా ఉంది. అయితే కొన్నాళ్లకి భర్తతో విబేధాలు తలెత్తడంతో ఆయన నుండి విడిపోయారు. కొన్నాళ్లక్రితం ఆమె భర్త గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం సినిమాల్లో అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న భానుప్రియ,  సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

click me!