నర్తనశాల నుండి ట్రైలర్ వచ్చేస్తుంది

By team teluguFirst Published Oct 21, 2020, 10:57 PM IST
Highlights


నర్తనశాల మూవీ నుండి రేపు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నర్తనశాల మూవీపై ఉన్న హైప్ రీత్యా రేపు రానున్న ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఐతే ఈ ట్రైలర్ కూడా బాలయ్య శ్రేయాస్ ఈటీ నుండే విడుదల చేస్తున్నారు. రేపు సాయంత్రం 6:15 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల కానుండగా.. వీక్షించాలంటే శ్రేయాస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
 


2003లో బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అలాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ మూవీ మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్న ఈ మూవీ సౌందర్య అకాల మరణంతో ఆగిపోయింది. 2004 ఎన్నికల ప్రచారం సంధర్భంగా సౌందర్య ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ఆమె మరణించారు. నర్తనశాల మూవీలో ఆమె కీలకమైన ద్రౌపది పాత్ర చేస్తున్నారు. అప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో అర్ధాంతరంగా ఆగిపోయింది. 

ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న  విడుదలవుతుంది. 
ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది వార్త నందమూరి అభిమానులలో ఫుల్ జోష్ నింపింది. 

కాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలయ్య అభిమానులతో పంచుకున్నారు. ఈ మూవీ నుండి రేపు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నర్తనశాల మూవీపై ఉన్న హైప్ రీత్యా రేపు రానున్న ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఐతే ఈ ట్రైలర్ కూడా బాలయ్య శ్రేయాస్ ఈటీ నుండే విడుదల చేస్తున్నారు. రేపు సాయంత్రం 6:15 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల కానుండగా.. వీక్షించాలంటే శ్రేయాస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 

click me!