75 శాతం మహేష్ బాబు బయట పడనేలేదు.. సందీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

By telugu teamFirst Published Aug 10, 2021, 11:45 AM IST
Highlights

మహేష్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ మూడ్ లో కనిపించారు. ట్విట్టర్ లో మహేష్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ స్పేస్ ని ఆర్గనైజ్ చేశారు.ఈ స్పేస్ లో కొంతమంది దర్శకులు కూడా పాల్గొన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. సోమవారం మహేష్ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి టీజర్ వచ్చింది. ఫ్యాన్స్ అంతా ఇంకా ఆ హ్యాంగోవర్ లోనే ఉన్నారు. టీజర్ లో మహేష్ స్టైల్, యాటిట్యూడ్ అదిరిపోవడంతో పోకిరి, దూకుడు లాంటి మాస్ చిత్రాల వైబ్స్ మొదలయ్యాయి. ఇది పక్కా కమర్షియల్ మూవీ. 

మహేష్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ మూడ్ లో కనిపించారు. ట్విట్టర్ లో మహేష్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ స్పేస్ ని ఆర్గనైజ్ చేశారు.ఈ స్పేస్ లో కొంతమంది దర్శకులు కూడా పాల్గొన్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ స్పేస్ లో పాల్గొని మహేష్ తో సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత సందీప్ వంగాకు ప్రముఖ హీరోలందరి నుంచి కాల్ వచ్చింది. అందులో మహేష్ కూడా ఉన్నాడు. తన కోసం మంచి సబ్జెక్టు రెడీ చేయాలని మహేష్ కోరాడు. ఈ సంగతులని సందీప్ స్పేస్ లో రివీల్ చేశాడు. మహేష్ బాబుతో చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. 

మహేష్ ని బయట నాలుగైదు సార్లు కలిశాను. రెండు ఇంట్రెస్టింగ్ లైన్స్ కూడా వినిపించాను. మహేష్ కి ఆ కథలు నచ్చినప్పటికీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. మహేష్ బాబు యాడ్ షూట్ కోసం నేను పనిచేశారు. నాకు తెలిసినంతవరకు సినిమాల్లో మహేష్ బాబుని మనం చూసింది 25 శాతం మాత్రమే. 75 శాతం మహేష్ బయట పడనేలేదు. 

అంటే మహేష్ బాబు సత్తాని ఫిలిం మేకర్స్ ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే ఉపయోగించుకున్నారు అని సందీప్ పరోక్షంగా తెలిపారు. ఆయనలోని కొన్ని మ్యానరిజమ్స్, అనేక కోణాలు మనం ఇంకా చూడనేలేదు. మహేష్ ని పూర్తిగా 100 శాతం వినియోగించుకుంటే ఎలా ఉంటుందో సందీప్ ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చాడు. త్వరలో తాము ఖచ్చితంగా కలసి వర్క్ చేస్తామని సందీప్ తెలిపాడు. ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

click me!