రామ్ చరణ్ ‘ఆర్సీ15’లో మరో సీనియర్ హీరో.. అప్పుడు ఎన్టీఆర్ తో.. ఇప్పుడు చరణ్ తో.!

By team teluguFirst Published Sep 13, 2022, 1:14 PM IST
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్సీ15’. ఇటీవల ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే చరణ్ తో కలిసి మరో సీనియర్ హీరో కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
 

‘ఆర్ఆర్ఆర్’తో  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెర్రీ నెక్ట్స్ ఫిల్మ్ ‘ఆర్సీ15’ కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు, క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ మరియు వైజాగ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చిత్రం నుంచి కూడా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ అందిస్తున్నారు. 

రీసెంట్ గా RC15 నుంచి అఫిషియల్ అప్డేట్ అందింది. ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్ కు మేకర్స్ అధికారికంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. చరణ్ సినిమాలో మలయాళ సీనియర్ హీరో, ప్రముఖ నటుడు మోహన్ లాల్ (Mohan Lal) కూడా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మూవీలో సెకండాఫ్ లోని ఓ కీలక ఎపిసోడ్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే  తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)తో కలిసి ‘జనతా గ్యారేజ్’చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చరణ్ తో కలిసి నటిస్తున్నారనడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రాంచరణ్ నటిస్తున్న RC15 పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. దిగ్గజ దర్శకుడు శంకర్ తొలిసారి తెలుగులో చేస్తున్న స్టైట్ మూవీ ఇది. ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ నుంచి వస్తున్న లీకులు కూడా సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తోంది. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది.  అలాగే అంజలి, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత  అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 

click me!