యాత్ర సినిమాలో సుచరితా రెడ్డి పాత్ర: ప్రేక్షకులు ఫిదా, అనసూయ ట్వీట్

Published : Feb 11, 2019, 07:00 AM IST
యాత్ర సినిమాలో సుచరితా రెడ్డి పాత్ర: ప్రేక్షకులు ఫిదా, అనసూయ ట్వీట్

సారాంశం

‘యాత్ర’లో సుచరితా రెడ్డిగా మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందారు. యాత్రలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా.. తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు ఆమె. తన ఆనందాన్ని అనసూయ ప్రేక్షకులతో పంచుకున్నారు.

హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర సినిమాలో తాను పోషించిన పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతుండడంతో ఆ ఆనందాన్ని అనసూయ తనివితీరా ఆనందిస్తున్నట్లున్నారు. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనను మరిచిపోవడం కష్టమే.

‘యాత్ర’లో సుచరితా రెడ్డిగా మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందారు. యాత్రలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా.. తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు ఆమె. తన ఆనందాన్ని అనసూయ ప్రేక్షకులతో పంచుకున్నారు.

"సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్‌ మహి వి రాఘవ, 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అనసూయ ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?