నిర్మాతగా అల్లు అరవింద్ కొడుకు!

By Udayavani DhuliFirst Published Dec 19, 2018, 12:49 PM IST
Highlights

అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా చెలామణి అవుతున్నాడు. ఫైనాన్షియర్ గా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా,  ఎగ్జిబిటర్ గా పలు రంగాల్లో తన సత్తా చాటారు. 

అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా చెలామణి అవుతున్నాడు. ఫైనాన్షియర్ గా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా,  ఎగ్జిబిటర్ గా పలు రంగాల్లో తన సత్తా చాటారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించారు.

ఆయన ముగ్గురు కుమారుల్లో ఇద్దరు హీరోలుగా చెలామణి అవుతున్నారు. రెండో కొడుకు అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడో కుమారుడు అల్లు శిరీష్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉన్నాడు.

ఈ క్రమంలో అరవింద్ పెద్ద కొడుకు బాబీ నిర్మాణ రంగంలోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. తన బంధువు సిద్ధూ అనే వ్యక్తితో కలిసి వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా నిర్మించబోతున్నాడు బాబీ. కొత్త దర్శకుడు కిరణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.

క్రీడల నేపధ్యంలో సాగే లవ్ స్టోరీతో సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నప్పటికీ ముందుగా బాబీ నిర్మాణంలో సినిమాను మొదలుపెట్టనున్నారు.

click me!