అభినేత్రి సినిమాతో సౌత్ లో చాలా రోజుల తరువాత మంచి హిట్ అందుకున్న ప్రభుదేవా ఇప్పుడు సీక్వెల్ తో రెడీ అవుతున్నాడు. అయితే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది.
ఈ టీజర్ జనాలను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పార్ట్ లో తమన్నా హారర్ సీన్స్ తో భయపెడితే ఇప్పుడు ప్రభుదేవా కూడా సిద్దమయ్యాడు. రెండు దెయ్యాల మధ్య పోరు సినిమాలో కీలక కథాంశం. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మించారు. ఇక సినిమాకు మే 1న రిలీజ్ చేయనున్నారు.