2.0: ఆలస్యమవ్వడానికి ఇది కూడా ఓ కారణం!

By Prashanth MFirst Published Sep 26, 2018, 5:55 PM IST
Highlights

ప్రతి సినిమాలో శంకర్ ఎదో ఒక సోషల్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటాడని అందరికి తెలిసిందే. ఇక 2.0 సినిమాలో కూడా మొబైల్ కి అడిక్ట్ అవ్వడం వంటి విషయాన్నీ ప్రధానంగా చూపించబోతున్నట్లు టీజర్ లోనే అర్ధమయ్యింది. 

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరక్కుతున్న మొదటి చిత్రం 2.0. దాదాపు 450 కోట్లతో నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. దర్శకుడు శంకర్ చేస్తున్న ప్రయోగం ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు సంబందించిన ఒక న్యూస్ ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది. 

ప్రతి సినిమాలో శంకర్ ఎదో ఒక సోషల్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటాడని అందరికి తెలిసిందే. ఇక 2.0 సినిమాలో కూడా మొబైల్ కి అడిక్ట్ అవ్వడం వంటి విషయాన్నీ ప్రధానంగా చూపించబోతున్నట్లు టీజర్ లోనే అర్ధమయ్యింది. ఇండియాలో సెల్ ఫోన్లను ఒక వ్యసనంలాగా మార్చుకున్న వారి దగ్గరి నుంచి మొబైల్స్ ను తీసుకోవడం వంటి సన్నివేశాలు టీజర్ లో అర్థమయ్యాయి. 

సినిమాలో అదే ప్రధానం అంశమని తెలుస్తోంది. అయితే ఆ సెల్ ఫోన్లతో ఒక పక్షిని తాయారు చేయడం వంటి విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట. అక్షయ్ కుమార్ తన కంట్రోల్ లో ఉంచుకొని చేసే పనులను చిట్టి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ గ్రాఫిక్స్ పనుల వల్లే సినిమా ఎక్కువగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. 

శంకర్ గ్రాఫిక్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సంతృప్తిగా అనిపించే వరకు ఒక నిర్ణయానికి రావడం లేదట. ఇక సినిమా ట్రైలర్ ను దీపావళికి రెడీ చెయ్యడానికి ప్రస్తుతం చిత్ర యూనిట్ కష్టపడుతోంది.      

click me!
Last Updated Sep 26, 2018, 5:55 PM IST
click me!