కారు ప్రమాదం: బిగ్ బాస్ ఫేమ్ యాషికకు తుంటి సర్జరీ, పోలీసు కేసు

By telugu teamFirst Published Jul 27, 2021, 8:06 AM IST
Highlights

మహాబలిపురం వద్ద కారు ప్రమాదం చేసిన బిగ్ బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో ఆమె స్నేహితురాలైన హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీరు భవాని మరణించిన విషయం తెలిసిందే.

చెన్నై: కారు ప్రమాదంపై బిగ్ బాస్ ఫేమ్, నటి యాషికా ఆనంద్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె డ్రైవింగ్ లైెన్స్ ను సీజ్ చేశారు. మహాబలిపురం సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఆమె కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆమెతో పాటు ఆమె మిత్రులు సయ్యద్, అమీర్ బయటపడగా హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇండనీరు వల్లిచెట్టి భవాని మరణించారు. 

వారు శనివారం అర్థరాత్రి మహాబలిపురం నుంచి చెన్నై తిరిగి వస్తుండగా సూలేరుకాడు వద్ద యాషికా కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో యాషికనే కారు నడిపినట్లు భావిస్తున్నారు. యాషిక, అమీర్, సయ్యద్ లను తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రముఖ అస్పత్రికి తరలించారు. 

యాషిక తుంటికి ఫ్రాక్చర్ అయింది. అయితే, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే యాషిక తండ్రి ఢిల్లీ నుంచి చెన్నైకి హుటాహుటిన తిరిగి వచ్చారు. ఆమె తుంటికి శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ఆమెకు ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. 

ఐపీసీలోని రెండు సెక్షన్ల కింద యాషికపై మహాబలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, మద్యం మత్తులో యాషిక కారు నడిపినట్లు ప్రచారం జరిగింది. ఈ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేయలేదు. కమల హాసన్ యాంకర్ గా వ్యవహరిస్తు్న తమిళ బిగ్ బాస్ తో యాషిక పాపులర్ అయ్యారు. కావలై వెండమ్ తో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. 

click me!