మేం ఇంట్లో ప్రశాంతంగా ఉంటే.. మీరు మాత్రం: మహేష్ బాబు

By Satish ReddyFirst Published Apr 16, 2020, 12:49 PM IST
Highlights
సూపర్‌ స్టార్ మహేష్ బాబు పారిశుధ్య కార్మికులకు తన వంతుగా మద్దతు తెలిపాడు. ఇప్పటికే పోలీసులను, డాక్టర్లను కీర్తిస్తూ ట్వీట్లు చేసిన మహేష్ తాజాగా పారిశుధ్య కార్మికులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
కరోన భయంతో ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయపడుతున్నారు. గడప దాటాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా కొంత మంది తమ ప్రాణాలకు తెగించి మన ప్రాణాల కోసం కష్టపడుతున్నారు,. వీళ్లలో ముందు వరుసలో ఉన్న వాళ్లు డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు. అందుకే వీరి కృషిని ఇప్పుడు ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మేం ఇంట్లో ధైర్యంగా ఉంటున్నాం అంటే మీరు బయట పనిచేస్తుండటం వల్లే అంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

తాజాగా  సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా వీరికి తన వంతుగా మద్దతు తెలిపాడు. ఇప్పటికే పోలీసులను ,డాక్టర్లను కీర్తిస్తూ ట్వీట్లు చేసిన మహేష్ తాజాగా పారిశుధ్య కార్మికులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. `మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న వారికోసం ఈ ట్వీట్. మనం అంతా ఇంట్లో సురక్షితంగా ఉంటే వారు మాత్రం బయట మన కోసం పనిచేస్తున్నారు. ప్రమాదాలు మన దరి చేరకుండా చూస్తున్నారు. ప్రాణాంతక వైరస్‌పై పోరాటంలో ముందు వరసులో నిలబడి మన కోసం యుద్ధం చేస్తున్నారు. వారందరికీ నా కృతజ్ఞతలు` అంటూ ట్వీట్ చేశాడు మహేష్.

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ముందుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మహేష్ తరువాత ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం గోత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

This one is for all the sanitation workers deployed on our streets to make sure the surroundings are kept clean and sanitised. While we are safe in our homes, they come out everyday leaving their own to ensure we remain out of harm's way... pic.twitter.com/P26e9t4kzc

— Mahesh Babu (@urstrulyMahesh)
click me!