
టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగారు. రేపు ఫిలిం ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ల సభ్యులు పిలుపునిచ్చారు. వేతనాలు పెంచని పక్షంలో షూటింగ్లు జరగనివ్వమని వారు చెబుతున్నారు. ఫిలిం ఫెడరేషన్ లోని 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. ప్రస్తుతం టాలీవుడ్ గాడిన పడినప్పటికీ, వేతనాల పెంపుపై మాత్రం నిర్మాతలు నోరుమెదపడం లేదు. సినీ పెద్దలు చొరవ తీసుకొని ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయకపోతే.. ఏ క్షణానైనా కార్మికులు సమ్మె బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.