రవితేజ 66వ సినిమాతో సిద్దమవుతున్నట్లు దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్లో వస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాతో సిద్దమవుతున్నట్లు దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. డాన్ శీను, బలుపు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్లో వస్తున్నారు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించబోతున్నారు. 2017లో తెలుగు సినిమాలో నటించారు శృతి హాసన్.. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారని చెబుతున్నారు. చిత్రయూనిట్. రవితేజ, శృతి హాసన్ కలిసి నటించబోయే రెండు సినిమా ఇది.
బలుపులో ఇప్పటికే ఓ సారి నటించారు ఈ జోడీ. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఇక మరోవైపు రవితేజ ప్రస్తుతం డిస్కోరాజకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు.విఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.