అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం: ఇళయరాజాతో ఎస్బీ బాలు గొడవ

Published : Sep 25, 2020, 02:46 PM IST
అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం: ఇళయరాజాతో ఎస్బీ బాలు గొడవ

సారాంశం

ఇళయరాజా నుంచి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు లీగల్ నోటీసులు వచ్చాయి. తన పాటలు బాలు పాడవద్దని ఆ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ లీగల్ నోటీసులు అందుకున్న తర్వాత బాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం ఉంది. బాలసుబ్రహ్మణ్యం అమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఆ వివాదం చోటు చేసుకుంది. అమెరికాలో బాలు 12 కార్యక్రమాలు చేయడానికి అంగీకరించారు. అప్పటికి రెండు కార్యక్రమాలు అయిపోయాయి.

అనూహ్యంగా ఇళయరాజా నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. తన పాటలు బాలు పాడవద్దని ఆ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ లీగల్ నోటీసులు అందుకున్న తర్వాత బాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక తర్వాతి కార్యక్రమాల్లో ఇళయరాజా పాటలు పాడనే లేదు. ఆ విషయాన్ని కార్యక్రమాల నిర్వాహకులకు కూడా చెప్పారు. ఇళయరాజా పాటలు పాడుకున్నా ఎందుకు పాడలేదని అడిగినవారు లేరు. 

అయితే, ఇళయరాజా ఆ నోటీసులు ఎందుకు ఇచ్చారనే విషయం ఎవరికీ తెలియదు. బాలు కూడా ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. ఇళయరాజాకు ఫోన్ చేస్తే సరిపోతుందని చాలా మంది బాలుకు చెప్పారట. కానీ ఆయన వినలేదు. భారతీరాజా ద్వారా ఇళయరాజా బాలుకు పరిచమయ్యారు. భారతీరాజా బాలుకు మంచి స్నేహితుడు. 

ఆ వివాదానికి ముందు ఆ ఏడాది జూన్ 4వ తేదీన మూకాంబికా సన్నిధిలో ఇళయరాజా, బాలు కలుసుకున్నారు. ఇళయరాజా చిత్ర, చరణ్, కార్యక్రమ నిర్వాహకులకు, ఆడిటోరియం యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. అదీ ఇళయరాజాపై ఎస్బీ బాలుకు కోపం.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?