ఎక్స్‌పోజింగ్‌ కోసమే రష్మిని వాడుకుంటున్నారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

By AN TeluguFirst Published Dec 30, 2019, 12:57 PM IST
Highlights

రష్మి సినిమాని రిజెక్ట్ చేయడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మి సినిమాకి రెమ్యునరేషన్ గా రూ.40 లక్షలు కావాలని డిమాండ్ చేసిందని.. కానీ యూనిట్ రూ.35 లక్షలు ఇస్తామని చెప్పడంతో రష్మి ఒప్పుకోలేదని అన్నారు. 

బుల్లితెరపై యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ ల కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. వీరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని కోరుకునే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఛాన్స్ వస్తే యాంకర్ రష్మి రిజెక్ట్ చేసిందట.

ఈ విషయాన్ని సుధీర్ ఓ సందర్భంలో చెప్పారు. రష్మి సినిమాని రిజెక్ట్ చేయడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మి సినిమాకి రెమ్యునరేషన్ గా రూ.40 లక్షలు కావాలని డిమాండ్ చేసిందని.. కానీ యూనిట్ రూ.35 లక్షలు ఇస్తామని చెప్పడంతో రష్మి ఒప్పుకోలేదని అన్నారు.

వాళ్ల వరసలకి మా రొమాన్స్ తో సంబంధం లేదు..

దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా రష్మి, సుధీర్ మధ్య మంచి ట్రాక్ నడుస్తోందని.. వీరి జంటని అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారని అన్నారు. బుల్లితెరపై రష్మి, సుధీర్ కలిసి ఎన్నో పాటలకు డాన్స్ చేశారని.. ఒకవేళ 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమాని రష్మి ఒప్పుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేదని అన్నారు.

ఇప్పటివరకు రష్మి చేసిన ఏ సినిమా కూడా సరైన సక్సెస్ అందుకోలేదని.. ఎందుకంటే ఆమెలోని గ్లామర్ ని చూపించడానికే ఆమెని వాడుకుంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. రష్మి కూడా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు కాకుండా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చే సినిమాలను ఎన్నుకుంటుందని.. దీని కారణంగా సినిమాల్లో ఆమెకి సరైన కెరీర్ ఉండదని అన్నారు.

'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమా ఒప్పుకోకుండా రష్మి పెద్ద పొరపాటు చేసిందని.. 'గుంటూరు టాకీస్' లాంటి సినిమాలు ఎన్ని చేస్తే ఏం లాభం అంటూ అసహనం వ్యక్తం చేశారు. స్కిన్ షో చేస్తే పది మంది కుర్రాళ్లు చూసి ఆనందపడతారని.. అది నటన కాదని.. అదే ఓ డైలాగ్ చెప్పి నలుగురి మెప్పు పొందితేనే గొప్పతనమని అన్నారు.

స్కిన్ షో చేయడానికి, హీరోతో బుగ్గా బుగ్గా రాసుకోవడం కష్టమేముంది అంటూ ప్రశ్నించారు. డబ్బుల కోసం కాకుండా కెరీర్ కోసం సినిమాలు ఎన్నుకోవాలని రష్మికి సలహాలు ఇచ్చారు. 

click me!