
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది బాగా కలిసి వస్తోంది. ఇప్పటికే విరూపాక్షతో భారీ హిట్ ను సాధించాడు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించిన తేజ్, తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన చిత్రం బ్రో ఈ నెల 28న విడుదల కానుంది. ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఈ క్రమంలో తేజ్ తాజాగా మరో కొత్త చిత్రం కమిటయ్యాడు. కొత్త దర్శకుడు జయంత్ పానుగంటి రూపొందించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో తేజ్ ఫుల్ ఫన్ తో కూడిన ఎంటర్టైనింగ్ రోల్ ను చేస్తున్నట్లు తెలుస్తోంది.
బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందిస్తున్న ఈ చిత్రంలో సాయి తేజ్ ....చీటీల చిన్ని అనే పాత్రలో కనిపిస్తాడట. పేరుకి తగ్గట్లే చీటీల బిజినెస్ చేస్తాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో. ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఆగష్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఈ చిత్రంలో చిన్నపాటి క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని, ఫస్టాఫ్ ఫన్ తోనూ,సెకండాఫ్ లో విలన్ ని పనిపట్టడంతో ముందుకు వెళ్తుందంటున్నారు. సాయి ధరమ్ తేజ్ తో కంటిన్యూ సినిమాలు చేస్తన్న నిర్మాతగా మారిపోయిన బీవీఎస్ఎన్ ప్రసాద్.. ఈ కామిక్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నారు. ‘విరూపాక్ష’ చిత్రానికి కూడా ఆయనే నిర్మాతని తెలిసిందే. మొత్తానికి ‘చీటీల చిన్ని’ చిత్రీకరణ వచ్చే నెల నుంచి మొదలవనుండగా.. 2024లో విడుదల కానుంది.