రవితేజ 'డిస్కో రాజా టీజర్ 2.0'.. !

By AN TeluguFirst Published Jan 13, 2020, 4:48 PM IST
Highlights

యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో మాస్ రాజాతో జోడీ కడుతుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న నూతన చిత్రం 'డిస్కో రాజా'. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్కక్షణం' వంటి సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ మొదటి టీజర్ ని బట్టి ఇదొక ప్రయోగాత్మక చిత్రమని తెలుస్తోంది. యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో మాస్ రాజాతో జోడీ కడుతుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

ఫస్ట్ డే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు (అప్డేట్)

తాజాగా ఈ సినిమా రెండో టీజర్ ని వదిలారు. ''సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోనూ.. ఫైరింగ్స్ తోనూ యుద్ధాలు చేసి రిటైర్ అయి ఇంట్లో ఉంటే సడెన్ గా వచ్చే సైలెన్స్ ఉంటాది చూడూ... అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయిలన్స్ కంటే భయంకరంగా ఉంటుంది..'' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

టీజర్ ని బట్టి కథను అంచనా వేయడం కష్టంగానే ఉంది.  దర్శకుడు వీఐ ఆనంద్ మరో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఈ సినిమాని జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

click me!