మైత్రి మూవీ మేకర్స్ నుంచి కోటిన్నర పెట్టి హక్కుల్ని చేజిక్కించుకున్న ఈ సినిమాకు దర్శకుడుగా లింగుస్వామితో సహా పలువురు దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నారట.
రామ్ చరణ్- సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి కేటగిరీలో కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం వచ్చి ఇంతకాలం అయినా ఎవరూ రీమేక్ కు సాహసించలేదు. దానికి తోడు తమిళ,మళయాళ వెర్షన్స్ రిలీజ్ అయ్యి డిజాస్టర్స్ అయ్యాయి. అయితే తెలుగులో దాదాపు 200 కోట్ల గ్రాస్ 100 కోట్ల షేర్ వసూళ్లతో సరికొత్త రికార్డులు నమోదు చేయటం కొరియోగ్రాఫర్ కం దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్రాక్ట్ చేసింది.
Bigg Boss 3: శ్రీముఖి ఫ్లయింగ్ కిస్.. అలీ కన్నీళ్లు!
దాంతో ధైర్యం చేసి ఈ సినిమానితమిళంలో రీమేక్ చేయటానికి రైట్స్ తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి కోటిన్నర పెట్టి హక్కుల్ని చేజిక్కించుకున్న ఈ సినిమాకు దర్శకుడుగా లింగుస్వామితో సహా పలువురు దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నారట. త్వరలోనే దర్శకుడిని ఫైనల్ చేసి షూటింగ్ ప్రారంభించే వీలుందని తెలుస్తోంది. అయితే లారెన్స్ సినిమాలు బాగా మాస్ గా మోటుగా ఉంటాయి.
దాంతో ఈ సినిమాని సైతం మరీ నాటుగా , ఊర మాస్ గా మార్చేస్తారని రంగస్దలం అభిమానులు కంగారుపడుతున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో ఏకంగా రంగస్దలాన్ని పాడు చేయద్దని, సేవ్ రంగస్దలం అన్నట్లుగా పోస్ట్ లు పెడుతున్నారు.
రైట్స్ తీసుకున్న తర్వాత వాళ్లకు తోచినట్లు మార్పులు చేస్తారు. ఖచ్చితంగా తమిళ రూరల్ నేటివిటికి తగ్గట్లుగా స్క్రిప్టు మార్చి, మరిన్ని మాస్ ఎలిమెంట్స్ కలిపి, లారెన్స్ బాడీ లాంగ్వేజ్ కు తగినట్లు గా సీన్స్ మార్చి వదలుతారు. ఆ తర్వాత దాన్ని తెలుగులోకి డబ్ చేయటం ఖాయం, అంటే మరోసారి మనం రంగస్దలం చూడబోతామన్నమాట. పందెంకోడి- రన్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లను తెరకెక్కించిన లింగుస్వామితో లారెన్స్ జోడీ కడితే మంచి బిజినెస్ అవతుందని తమిళ ట్రేడ్ వర్గాల టాక్.