పవన్ సినిమా.. మే 23న రిలీజ్..?

By AN TeluguFirst Published Jan 17, 2020, 9:48 AM IST
Highlights

ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించ లేదు

'అజ్ఞాత‌వాసి' సినిమా త‌ర్వాత పూర్తి రాజ‌కీయాల‌తో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు.

ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా జ‌న‌వ‌రి 20న సెట్స్ పైకి వెళ్లనుందట.  ఫిబ్ర‌వ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని, కేవ‌లం ఇరవై రోజులు మాత్రం ఆయన కాల్షీట్స్ ఇచ్చాడని అంటున్నారు.

మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్.. వైరల్ పిక్స్

 ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఈ కోర్టు సెట్ లోనే చిత్రీకరించనున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా సమాచారం. 

రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలిస్తే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. 

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలో ఒక డ్యూయెట్, రెండు ఫైట్లు కూడా ఉంటాయి. ఇప్పటికే నివేదా థామస్, అంజలి, అనన్య వంటి తారలను కీలకపాత్రలకు ఎంపిక చేశారు. 

click me!