మొదలైన పవన్ పింక్.. టార్గెట్ 20

By Prashanth MFirst Published Jan 20, 2020, 1:13 PM IST
Highlights

పింక్ రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. గత ఏడాది నుంచి పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల పుకార్లు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. కానీ ఫైనల్ గా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా సినిమా ట్రాక్ లోకి వచ్చింది. 

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. గత ఏడాది నుంచి పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల పుకార్లు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. కానీ ఫైనల్ గా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా సినిమా ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఎప్పటికప్పుడు సినిమాకు సంబందించిన లుక్స్ కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే.

హైదరాబాద్ లో సినిమాకు సంబందించిన మొదటి షాట్ ని సింపుల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలతో సినిమాని మొదలుపెట్టారు. ఇకపోతే పవన్ రెగ్యులర్ గా ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొంటాడనే టాక్ వస్తోంది. మొదట సినిమాని స్టార్ట్ చేస్తే బెటర్ అని చిత్ర యూనిట్ తో ఒక నిర్ణయానికి వచ్చాడు.   ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు.

తమన్ సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించ లేదు. కేవ‌లం ఇరవై రోజులు మాత్రమే పవన్ కాల్షీట్స్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్.  సినిమా కోసం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ కోర్టు సెట్ వేశారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఈ కోర్టు సెట్ లోనే చిత్రీకరించనున్నారు.

ఇప్పుడు ఈ సినిమా విడుదలకు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా సమాచారం.  రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలిస్తే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలో ఒక డ్యూయెట్, రెండు ఫైట్లు కూడా ఉంటాయి. ఇప్పటికే నివేదా థామస్, అంజలి, అనన్య వంటి తారలను కీలకపాత్రలకు ఎంపిక చేశారు.

click me!