యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి లాంగ్ గ్యాప్ ఏర్పడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ వెండితెరపై కనిపించి లాంగ్ గ్యాప్ ఏర్పడుతోంది. 2019, 2020 సంవత్సరాలు ఎన్టీఆర్ కెరీర్ లో ఖాళీగా మిగిలిపోనున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటించబోయే చిత్రం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శత్వంలో ఎన్టీఆర్ మరోసారి నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే నిజమైనది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రెండవ చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చేసింది.
ముందుగా ఊహించనట్లుగానే ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించనుంది. ఇందులో నందమూరి అభిమానులకు మరో సర్ ప్రైజ్ కూడా ఉంది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
The BIG announcement you all have been waiting for is here!! 🤩🤩
Young Tiger & garu are coming together again for & it will be produced by along with !
Stay tuned for more exciting updates! pic.twitter.com/12JBbsYg29
హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారిక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్, సంగీత దర్శకుడు లాంటి ఇతర వివరాలని చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుంది.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం అరవింద సమేత. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. అంతకు మించి ఉండేలా ఎన్టీఆర్ 30 వ చిత్రానికి ప్రణాలిక రూపొందుతోంది. ఈ చిత్రానికి 'అయినను పోయి రావాలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కళ్ళు చెదిరే అందం.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటో షూట్!