అఫీషియల్ : 'మహానటి' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా!

By telugu news teamFirst Published Feb 26, 2020, 12:58 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కించబోతుందని అన్నారు.

యువ దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాతో పాపులారిటీ దక్కించుకున్నాడు. తెలుగులో వచ్చిన ఈ సినిమా భారత చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఎన్నో అవార్డులు, గౌరవాలు లభించాయి.

అయితే ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా.. నాగ్ అశ్విన్ మరో సినిమా ప్రకటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కించబోతుందని అన్నారు.

ఇప్పుడు ఈ విషయంపై అధికార ప్రకటన వచ్చేసింది. నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేయబోతున్నట్లు వైజయంతి మూవీస్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.  చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట నాగ్ అశ్విన్. ఇప్పుడు అందుకు తగ్గ భారీ కథను కూడా డిజైన్ చేసి పెట్టుకున్నాడట. ప్రస్తుతం ప్రభాస్.. 'జిల్‌' ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత నాగ్ అశ్విన్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి.  


 

click me!