అడ్వాన్స్ బుకింగ్స్ లో 'సరిలేరు నీకెవ్వరు!'

By Prashanth MFirst Published Jan 9, 2020, 3:39 PM IST
Highlights

సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ నెల 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రీమియర్ షోలను కూడా భారీగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక ఎప్పటిలానే యూఎస్ లో మహేష్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సారి యూఎస్ లో మహేష్ సినిమా సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ నెల 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రీమియర్ షోలను కూడా భారీగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక ఎప్పటిలానే యూఎస్ లో మహేష్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సారి యూఎస్ లో మహేష్ సినిమా సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది.

అమెరికాలో జనవరి 10 మధ్యాహ్నం నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబందించిన బజ్ చూస్తుంటే మహేష్ మొదటిరోజే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మహేష్ గత సినిమాలు ఈజీగా 1మిలియన్ డాలర్స్ ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో సరిలేరు నీకెవ్వరు లక్షల డాలర్లను రాబట్టినట్లు సమాచారం. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుండడం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి.

సంక్రాంతి సీజన్ లో ప్రవాసులు మహేష్ సినిమాను అమితంగా ఇష్టపడతారు. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో సరిలేరు నీకెవ్వరు కోసం ఎగబడుతున్నారు. సినిమా 1.5మిలియన్ డాలర్స్ ని ప్రీమియర్స్ ద్వారానే అందుకోవచ్చని టాక్. ఇక మొదటిరోజు ఈ సీనిమా మొత్తంగా 25కోట్ల షేర్స్ ని అందుకునే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

click me!