SVP Mass Celebrations : ‘సర్కారు వారి పాట’పై నాన్న రియాక్షన్ ఇదే.. మహేశ్ బాబు ఇంట్రెస్టింగ్ స్పీచ్

By team teluguFirst Published May 16, 2022, 9:20 PM IST
Highlights

థియేటర్లలో ‘సర్కారు వారి పాట’ సందడి నెలకొంది. సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు కర్నూల్ లో మాస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో మహేశ్ బాబు స్పీచ్ ఇస్తూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

దర్శకుడు పరుశురాం పెట్ల,  సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). దాదాపు రెండేండ్ల తర్వాత మహేశ్ బాబు ఈ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టాడు. మే 12 రిలీజ్ అయిన ఈ చిత్రం నెగెటివ్ టాక్ ను దాటుకొని బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు చిత్ర యూనిట్ ఏపీలోని కర్నూల్ లో ‘సర్కారు వారి పాట’ మాస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఎమోషన్  స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

‘సర్కారు వారి పాట’ను రెండేండ్లు అన్ని కష్టనష్టాలకు ఓర్చి నిర్మించాం. కరోనా కారణంగా ఎదురైన పరిస్థితుల వల్ల చాలా ఇబ్బంది అయ్యింది. సినిమాను అభిమానులు, ప్రేక్షకులు బ్లాక్ బాస్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను చూసిన వెంటనే ఫాదర్ కృష్ణ గారు అద్భుతమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. తప్పకుండా ఈ చిత్రం ‘పోకిరి, దూకుడు’ చిత్రాలను మించి పోతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బ్లాక్ బాస్టర్ అయ్యింది. మరీ ముఖ్యంగా సితారా, గౌతమ్ సినిమా చూడగానే ‘నాన్న మీరు అన్ని మూవీస్ కన్నా ఈ చిత్రంలో చాలా కొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్నారని చెప్పడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్స్, చిత్రయూనిట్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. 

బ్యాకింక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. చిత్రంలో వెన్నెల కిశోర్, విలన్ పాత్రలో సముద్రఖని నటించారు. 

click me!