కార్తికేయకు ‘చావు కబురు చల్లగా’ చెప్తున్న గీతా ఆర్ట్స్

By tirumala ANFirst Published Dec 15, 2019, 6:36 PM IST
Highlights

‘భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మరో విభిన్నమైన చిత్రానికి రంగం సిద్దమైంది.  ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.

‘భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మరో విభిన్నమైన చిత్రానికి రంగం సిద్దమైంది.  ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఆర్ఎక్స్ 100 అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌తో హిట్ కొట్టిన కార్తికేయ ఆ త‌ర్వాత ఆ స్దాయి సినిమాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాలేక‌పోతున్నాడు. రీసెంట్ గా కార్తికేయ నటించిన 90 ఎంఎల్ చిత్రం సైతం డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ నేపధ్యంలో తన కెరీర్ కు  మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు కార్తికేయ. ఈ క్రమంలో ఆయన దగ్గరకు ఈ ఆఫర్ వచ్చింది. వెంటనే ఓకే చేసారు. ఈ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

Our next project is going to be with as , A crazy & unique subject titled as

Presents
Producer :
Director : Debutante

SHOOT BEGINS SOON... 🎬🎥 pic.twitter.com/3P9Y48dAUi

— GA2 Pictures (@GA2Official)


ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు కౌశిక్. 2020లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ డిఫెరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కనుంది . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ చిత్రం రూపొంద‌నుంది. బ‌స్తీ బాలరాజు పాత్ర‌లో కార్తికేయ  కనిపించనున్నాడు.

 

click me!