
యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మహా తొలి ప్రయత్నం ‘కేరాఫ్ కంచరపాలెం’ తో అందరి దృష్టీనీ ఆకర్షించాడు. కొత్త నటులతో...సరికొత్త స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఈ చిత్రం కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసే ప్రయత్నం చేసిందనే అందరూ అన్నారు.
విడుదలకు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్లో రానా విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. దాంతో ఆయన తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు..ఏ సినిమామ చేస్తున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
వెంకటేష్ మహా తన నెక్ట్స్ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేసేస్తున్నారు. ఈ సినిమా ఓ విలేజ్ సెట్ లో జరుగుతోంది. సినిమాలో ఎక్కువ భాగం అరుకులో షూట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్త వాళ్లే నటిస్తున్నారు. కంచరపాలెం నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అందుతున్న సమాచారం మేరకు... మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రం వెంకటేష్ మహాకు బాగా నచ్చటంతో రీమేక్ చేస్తున్నారు. ‘మహేషింటె ప్రతీకారం’లో చిత్రం ఫాహద్ ఫాజల్ ముఖ్యపాత్ర చేశారు. తెలుగు రీమేక్లో ఆయన పాత్రను సత్యదేవ్ చేస్తున్నారు. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్ రీమేక్ చేశారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ బడ్జెట్ విషయంలో చిన్న సినిమానే అయినా ప్రేక్షకాదరణలో మాత్రం పెద్ద సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకపోవటంతో ఆయన తదుపరి చిత్రం కోసం చాలా మంది మీడియా సైతం ఎదురుచూస్తోంది. ఆయన ఈ సారి తన సొంత కథతో కాకుండా ఓ రీమేక్ తో మన ముందుకు రాబోవటం విశేషం.