రవితేజ వద్దనుకున్నాడు.. శర్వానంద్ సీన్ లోకి?

By tirumala ANFirst Published Jan 5, 2020, 12:11 PM IST
Highlights

స్క్రిప్టు రాసేటప్పుడు ఫలానా హీరో కోసం అనుకుని రెడీ చేస్తూంటారు చాలా మంది దర్శకులు. అయితే సవాలక్ష కారణాలతో ఆ స్క్రిప్టులు వేరే హీరోలు చుట్టూ ప్రదిక్షణాలు చేసి, చివరకి ఎక్కడో సెటిలై , తెరకెక్కుతాయి. 

స్క్రిప్టు రాసేటప్పుడు ఫలానా హీరో కోసం అనుకుని రెడీ చేస్తూంటారు చాలా మంది దర్శకులు. అయితే సవాలక్ష కారణాలతో ఆ స్క్రిప్టులు వేరే హీరోలు చుట్టూ ప్రదిక్షణాలు చేసి, చివరకి ఎక్కడో సెటిలై , తెరకెక్కుతాయి. కొన్ని స్క్రిప్టులకు అయితే ఆ అవకాసం కూడా ఉండదు. తాజాగా చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన స్క్రిప్టు ఒకటి శర్వానంద్ దగ్గరకు వచ్చి ఆగిందని సమాచారం.

వివరాల్లోకి వెళితే....'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి హిట్ ని  అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన గత కొంతకాలంగా  రెండవ సినిమాగా  'మహాసముద్రం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని స్క్రిప్టు రాసుకుని హీరోలు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.  ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా చేద్దామనుకున్నాడు.  కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.  తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుకుంటే అదీ ముందుకు వెళ్లలేదు.

అయితే ఈ లోగా మాస్ మహా రాజ రవితేజ స్వయంగా పిలిచి తనను డైరక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చారు. అజయ్ భూపతి తన దగ్గర ఉన్న కథని నేరేట్ చేసారు. రవితేజ చాలా ఎక్సైట్ అయ్యి సినిమా చేద్దామన్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందని టాక్ వచ్చింది. కానీ ప్రాజెక్టు మాత్రం ఇప్పటికి ఎనౌన్స్ కాలేదు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమా కాన్సిల్ అయ్యనట్లే అని తెలుస్తోంది. అజయ్ భూపతి కథ బాగున్నా..బడ్జెట్ ఎక్కువని, మరో హీరో సైతం ఈ కథలో అవకాసం ఉందని, ఇప్పుడు రవితేజ కు ఉన్న  మార్కెట్ దృష్ట్యా కష్టం అని ప్రక్కన పెట్టారంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు ఆ కథ శర్వానంద్ దగ్గరకు చేరిందని సమాచారం. శర్వా ఈ కథ విని...బాగుంది కానీ ఆలోచించి చెప్తాను అన్నట్లు సమాచారం. అయితే కథ చెప్పేటప్పుడు శర్వా రియాక్షన్ చూసి సినిమా ఓకే అయ్యేలా ఉందని దర్శకుడు ఆశలు పెట్టుకున్నాడట. రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్నాడు.  

click me!