హైదరాబాద్ నాకు సొంత ఇళ్లులా అనిపిస్తోంది .. తెలుగులోనూ సినిమా చేస్తా.. వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్!

By team teluguFirst Published Nov 19, 2022, 7:30 PM IST
Highlights

బాలీవుడ్ స్టార్స్ వరుణ్‌ ధావన్‌ - కృతిససన్‌ కలిసి నటించిన చిత్రం ‘భేదియా’. తెలుగులో అల్లు అరవింద్ ‘తోడేలు’గా విడుదల చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్  మీట్ లో వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 


బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) - హీరోయిన్ కృతిససన్‌ (Kriti Sanon) కలిసి నటించిన చిత్రం ‘భేదియా’. తెలుగులో అల్లు అరవింద్ ‘తోడేలు’గా విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. కామెడీ హార్రర్ ఫిల్మ్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్  మీట్ లో వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

వరుణ్ ధావన్ మాట్లాడుతూ... హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లా ఉంది. ఒక దర్శకుడి కొడుకుగా సినిమా నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం. ఓన్లీ హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం. ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ముంబై, హైదరాబాద్ కి చెందిన వాళ్ళే. మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇక మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేసాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది. నిర్మాత దినేష్ విజన్ గురించి మాట్లాడుతూ, పుష్ప సినిమా కంటే ముందే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అవుతాడు అని నమ్మి అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి వచ్చారు. ఫ్యూచర్ లో ఆయన అల్లు అర్జున్ సినిమా తియ్యాలని కోరుకుంటున్నాను. వరుణ్ గురించి మాట్లాడుతూ వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దామని హామీనిచ్చారు. ఇక సినిమా ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన  ‘చిలిపి వరాలే ఇవ్వు’ (Chilipi Varaale Ivvu), ‘తుంకేశ్వరి’ స్పెషల్ సాంగ్ అన్ని భాషల్లో ఆకట్టుకుంది. క్రితి సనస్, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ కలిసి వేసిన మాస్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ సాంగ్ కూడా దూసుకుపోతోంది. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. 

click me!