రవితేజ కు దిల్ రాజు సాయిం,కష్ట సమయంలో తప్పదు

By Surya PrakashFirst Published Dec 6, 2023, 10:08 AM IST
Highlights

రవితేజను ఒడ్డున పడేయటానికి దిల్ రాజు ముందుకు వచ్చారట. గతంలో దిల్ రాజు ,రవితేజ కాంబోలో భద్ర సినిమా, ఆ తర్వాత అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ చిత్రం రెండు సూపర్ హిట్స్.


రవితేజ వరస డిజాస్టర్స్ తో వెనకబడ్డారు. మరీ ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం కు కనీస ఓపినింగ్స్ కూడా రాకపోవటం  ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో రవితేజ హిందీ మార్కెట్, శాటిలైట్ మార్కెట్, ఓటిటి మార్కెట్ డౌన్ అయ్యిపోయాయి. దాంతో అంతకుముందు కమిటైన చిత్రాల నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అంతెందుకు గోపీచంద్ మలినేని(Gopichand Malineni), రవితేజ కాంబినేషన్లో సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించిన ప్రాజెక్టు సైతం పెండింగ్ లో పడింది. 

గోపీచంద్ మలినేని – రవితేజ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సినా ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ అయితే వాయిదా వేశారు. ఇందుకు కారణం బడ్జెట్ అని తెలుస్తుంది. ‘ధమాకా’ తర్వాత వచ్చిన రవితేజ రెండు సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడం,  బడ్జెట్ పెరగడంతో పాటు, ఏ ఓటీటీ కూడా ఈ సినిమాని తీసుకోవడానికి ఇంకా ముందుకు రాలేదని అందుకే ప్రస్తుతం సినిమా షూటింగ్ ని వాయిదా వేశారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Latest Videos

ఈ క్రమంలో రవితేజను ఒడ్డున పడేయటానికి దిల్ రాజు ముందుకు వచ్చారట. గతంలో దిల్ రాజు ,రవితేజ కాంబోలో భద్ర సినిమా, ఆ తర్వాత అనీల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ చిత్రం రెండు సూపర్ హిట్స్. దాంతో రవితేజతో కాస్త బడ్జెట్ ఎక్కువైనా చేయాలని ఇలాంటి కష్టసమయంలో రవితేజను ఒడ్డున పడేయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యి అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఫార్మల్ గా ఎనౌన్సమెంట్ వస్తుందని వినికిడి. 

click me!