అనుష్క ఫోటో పెట్టి.. యువకుడిని మోసం చేసి..!

By AN TeluguFirst Published Feb 5, 2020, 12:51 PM IST
Highlights

అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇతడికి ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. 

సినీ నటి అనుష్క ఫోటోని ఫేస్ బుక్ లో ప్రొఫైల్ ఫోటోగా పెట్టిన సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి.. అతడి నుండి రూ.1.1 లక్షలు కాజేశాడు. దీంతో మోసపోయిన బాధితుడు మంగళవారం నాడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇతడికి ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయి పేరుతో, అనుష్క ప్రొఫైల్ ఫోటోగా ఉండడంతో రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడు.

ఆ తరువాత అవతలి వ్యక్తి అమ్మాయిలానే ఆరు నెలల పాటు బాధితుడితో చాటింగ్ చేశారు. ఆ తరువాత మెల్లగా తన ఉద్యోగం పోయిందని.. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పడంతో.. సహాయం చేయడానికి బాధిత యువకుడు ఒక్కో దఫా వెయ్యి నుండి మూడు వేల వరకు పేటీఎం యాప్ ద్వారా డబ్బులు పంపించాడు.

అలా మొత్తం రూ.1.1 లక్షలు బదిలీ చేశాడు. అయితే కనీసం ఒక్కసారి కూడా యువతిగా చెప్పుకొన్న వారితో మాట్లాడలేదు. తన తల్లితండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం ఇచ్చేసి మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  
 

click me!