బాలీవుడ్ కు వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. ఇటీవల రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి లెజెండ్రీ నటుల్ని బాలీవుడ్ కోల్పోయింది. బాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అన్వర్ సాగర్(70) తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్ కు వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. ఇటీవల రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి లెజెండ్రీ నటుల్ని బాలీవుడ్ కోల్పోయింది. బాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అన్వర్ సాగర్(70) తుదిశ్వాస విడిచారు. అన్వర్ సాగర్ ఎన్నో చిత్రాలకు పాటలు అందించారు.
ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్వర్ సాగర్ తుది శ్వాస విడిచారు. అన్వర్ సాగర్ మృతికి కారణాలు తెలియలేదు. అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉండొచ్చని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అన్వర్ మృతి పట్ల బాలీవుడ్ సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్ వారు ట్విట్టర్ వేదికగా అన్వర్ మృతికి సంతాపం తెలిపారు. అన్వర్ సాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.
అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు అప్పట్లో అన్వర్ అద్భుతమైన సాహిత్యం అందించారు. అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీ చిత్రంలోని వాదా రహా సనమ్ అనే పాట సంగీత ప్రియులని ఉర్రూతలూగించింది.