ఆ ముగ్గురికి బిగ్ బాస్ వితిక ఛాలెంజ్.. ఫొటోస్ వైరల్

Published : Jan 07, 2020, 09:33 PM IST
ఆ ముగ్గురికి బిగ్ బాస్ వితిక ఛాలెంజ్.. ఫొటోస్ వైరల్

సారాంశం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇటీవల మొక్కలు నాటింది. వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరుకి శ్రీముఖి ఛాలెంజ్ ఇచ్చింది. 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇటీవల మొక్కలు నాటింది. వరుణ్ సందేశ్ సతీమణి వితిక షెరుకి శ్రీముఖి ఛాలెంజ్ ఇచ్చింది. చాలెంజ్ ను స్వీకరించిన వితిక నేడు తన నివాసంలో తన తల్లి, అత్తమ్మ తో కలిసి  మొక్కలు నాటడం జరిగింది. 

ఈ సందర్భంగా వితిక మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడ అందరం తీసుకోవాలి అని వితిక పిలుపునిచ్చారు. 

వితిక మరో ముగ్గురికి  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు. నటులు నందు, కార్తికేయ , సింగర్ హేమచంద్రకు ఛాలెంజ్ చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. వితిక మొక్కలు నాటిన దృశ్యాలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 3 లో వితిక టాస్క్ లలో కూడా బాగా పెర్ఫామ్ చేసింది.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?