'భీష్మ' సడెన్ సక్సెస్ మీట్..వెనక అసలు సీక్రెట్

By tirumala ANFirst Published Feb 26, 2020, 8:33 PM IST
Highlights

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన చిత్రం భీష్మ. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ కు దారితీసింది. 

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన చిత్రం భీష్మ. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ కు దారితీసింది. అలాగే నితిన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇంత పాజిటివ్ టాక్ రన్ అవుతున్నప్పుడు పనిగట్టుకుని మరీ నిర్మాతలు సక్సెస్ మీట్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మీడియాలో చర్చనీయాంసంగా మారింది. అదీ వీకెండ్ అయ్యిపోయాక హఠాత్తుగా మీడియాని ఎందుకు కలిసారు అని అందరూ డిస్కస్ చేసుకున్నారు.

వాళ్ల డిస్కషన్స్ లో తేలిన విషయం ఏమిటీ అంటే.. మొదటి మూడు రోజులలోనే భీష్మ ఆంధ్రా మరియు తెలంగాణాలలో కలిపి మంచి షేర్ రాబట్టింది. ఓవరాల్ గా నితిన్ కి ఈ సినిమా భారీ హిట్ ను అందించింది అని ఆనందపడేలోగా ట్విస్ట్ పడింది. కలెక్షన్స్ డ్రాప్ ప్రారంభమైంది. ముఖ్యంగా సోమవారం నుంచి డ్రాప్ అవుతూ మంగళవారం మరీ తగ్గిపోయింది. చాలా చోట్ల ఈ చిత్రం కేవలం 30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది.

చాలా పెద్ద లాభాలు ఈ సినిమాతో వస్తాయనుకున్న ట్రేడ్ దీంతో షాక్ అయ్యింది. ఇదే కంటిన్యూ అయితే నష్టాలైతే రావు కానీ, లాభాలు మాత్రం చెప్పుకోదగినవి ఉండవు. ఇది గమనించిన నిర్మాతలు... ఈ కలెక్షన్స్ డ్రాప్ ని అరికట్టి...బూస్టప్ ఇవ్వటానికి సక్సెస్ మీట్ తో సీన్ లోకి వచ్చారు. అయితే సక్సెస్ మీట్ ఎంతవరకూ ఆక్యుపెన్సీ ని ప్రభావం చేస్తుందనేది తెలియాల్సిన విషయం.

 ఇక ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ నితిన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్‌లో అతి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకి కుడుములకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో, వెంకీ తన విమర్శకులకు తన శైలిలో సరైన సమాధానం చెప్పాడని నితిన్ తెలిపాడు.  
 

click me!