అనుష్క మీడియా ను ఎవాయిడ్ చేస్తోందా?

By tirumala ANFirst Published Dec 3, 2019, 6:34 PM IST
Highlights

చూస్తూంటే ...అనుష్క కావాలనే మీడియాకు దూరంగా పెడుతున్నట్లు అనిపిస్తోంది. తెరపై ఏ పాత్రలోకు అయినా ఈజీగా పరకాయప్రవేశం చేసి దుమ్ము రేపే అనుష్క  అంటే మీడియాకు కూడా చాలా ఇష్టం...గౌరవం. ఆమెను మీడియా ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. 

చూస్తూంటే ...అనుష్క కావాలనే మీడియాకు దూరంగా పెడుతున్నట్లు అనిపిస్తోంది. తెరపై ఏ పాత్రలోకు అయినా ఈజీగా పరకాయప్రవేశం చేసి దుమ్ము రేపే అనుష్క  అంటే మీడియాకు కూడా చాలా ఇష్టం...గౌరవం. ఆమెను మీడియా ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఎందుకని ఆమె ఇలా చేస్తోంది అంటే కేవలం తను బరువు పెరిగిన విషయం గురించి మాట్లాడాల్సి వస్తుందని అని తెలుస్తోంది.

సైజ్ జీరో చిత్రం తర్వాత పెరిగిన బరువు ..తగ్గటం కోసం ఆమె నానా విధాలుగా కష్టపడుతోంది. కానీ వర్కవుట్ అవ్వటం లేదు. తిరిగి సరైన షేప్ కు రావటం లేదు. సినిమాల్లో అంటే ఏదో మ్యానేజ్ చేస్తున్నారు కానీ లైవ్ లో కనపడితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. దాంతో ఆమె తన తాజా చిత్రం నిశ్శబ్దం ప్రెస్ మీట్ ని కూడా ఎవాయిడ్ చేసింది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అనుష్క..ఆస్ట్రేలియా వెళ్లి బరువు తగ్గించుకునే పనిలో ఉంది. ఈ నెలాఖరకు ఆమె ఇండియా తిరిగి రానుంది. అప్పటినుంచి ఆమె నిశ్శబ్దం చిత్రం ప్రమోషనల్ యాక్టివిటీలో పాల్గొనబోతోంది. అంటే జనవరి నుంచి ఆమె మీడియాలో కనపడుతుందన్నమాట.

‘నిశ్శబ్దం’  సినిమాలోని పాత్ర కోసం నాలుగు నెల‌లు క‌ష్టప‌డి సైన్ లాంగ్వేజ్‌, పెయింటింగ్ నేర్చుకుంది అని దర్శకుడు హేమంత్ మధుకర్   పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాధవన్‌, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రూపొందుదున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31, ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  

click me!