ఒకేసారి రెండు కథలు.. సక్సెస్ లేకపోయినా అల్లు బ్రదర్ ఫుల్ బిజీ

By Prashanth MFirst Published Dec 6, 2019, 7:59 AM IST
Highlights

అల్లు ఫ్యామిలిలో అల్లు అరవింద్ నిర్మాతగా మంచి సక్సెస్ లు అందుకుంటుంటే తనయుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. అందరూ సెట్టయ్యారని అనుకుంటే ఒక్క అల్లు శిరిష్ మాత్రం ఇంకా కెరీర్ ను సక్సెస్  ట్రాక్ లోకి ఎక్కించలేకపోతున్నాడు. 

మెగా ఫ్యామిలిలో యువ హీరోలు ప్రతి ఒక్కరు కూడా వరుస హిట్స్ తో వారికంటూ ఒక స్పెషల్ బ్రాండ్ క్రేజ్ ను తెచ్చుకున్నారు. ఇక అల్లు ఫ్యామిలిలో అల్లు అరవింద్ నిర్మాతగా మంచి సక్సెస్ లు అందుకుంటుంటే తనయుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. అందరూ సెట్టయ్యారని అనుకుంటే ఒక్క అల్లు శిరిష్ మాత్రం ఇంకా కెరీర్ ను సక్సెస్  ట్రాక్ లోకి ఎక్కించలేకపోతున్నాడు.

 

ఇంతవరకు పెద్దగా సక్సెస్ లు అందుకోలేదు. ఈ యువ హీరో గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. శ్రీ రస్తు శుభమస్తు సినిమా తప్పితే ఇంతవరకు ఒక్క సక్సెస్ కూడా చూడలేదు. ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ కొట్టాలని రీమేక్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఏబీసీడీ సినిమాను రీమేక్ చేసిన శిరీష్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు.

అయితే రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో బెల్లంకొండ వారసుడికి బాక్స్ ఆఫీస్ హిట్ అందించిన దర్శకుడు రమేష్ వర్మతో నిర్మాత అల్లు అరవింద్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొడుకు శిరీష్ కోసం ఏదైనా రీమేక్ ను సెట్ చేసుకొమ్మని చెప్పినట్లు సమాచారం. అలాగే మరో దర్శకుడితో కూడా శిరీష్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. మెగా మేనల్లుడితో ఇంతకుముందు విజేత సినిమాను డైరెక్ట్ చేసిన రాకేష్ శశితో కూడా శిరీష్ ఒక సినిమా చేసేందుకు  ఇంట్రెస్ట్ చూపుతున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. కుదిరితే రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తెచ్చే అవకాశం ఉందట. ఏదేమైనా సక్సెస్ లేకపోయినా అల్లు బ్రదర్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు.   

click me!