'అల వైకుంఠపురములో..' మల్లు ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్

By Prashanth MFirst Published Jan 8, 2020, 2:31 PM IST
Highlights

అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ మలయాళంలో కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో రిలీజయిన బన్నీ ప్రతి చిత్రం కేరళలో కూడా అదే తరహాలో మంచి వసూళ్లను అందుకుంటాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ మలయాళంలో కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో రిలీజయిన బన్నీ ప్రతి చిత్రం కేరళలో కూడా అదే తరహాలో మంచి వసూళ్లను అందుకుంటాయి.  అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న కొత్త సినిమాను కూడా కేరళలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు.

అక్కడ అభిమానుల కోసం ప్రత్యేకంగా 30 స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారట. రిలీజ్ రోజు తెల్లవారుజాము నుంచే షోలు మొదలుకానున్నాయి. కేరళలో  రంగస్థలం - జై లవ కుశ - భాగమతి వంటి సినిమాలను మలయాళంలో డబ్ చేసిన రిలీజ్ చేసిన RD ఇల్ల్యుమినేషన్ సంస్థ అల.. వైకుంఠపురములో డబ్బింగ్ రైట్స్ ను అందుకుంది.

హాట్ గురూ : అందాలతో పిచ్చెక్కిస్తున్న మాజీ హీరోయిన్

అలాగే మల్లు అభిమానులను ఆకర్షించే విధంగా ''అంగు వైకుంతపురతు” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ లో సినిమా పనులన్నీటికీ ఎండ్ కార్డ్ వేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

ఇక సినిమాను జనవరిలో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అదే సమయానికి మలయాళంలో కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి మల్లు స్టార్ అభిమానులు ఈ సినిమాను ఏ స్థాయిలో హిట్ చేస్తారో చూడాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

click me!