మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేలానికి 409 మంది మహిళా క్రికెటర్లు షార్ట్ లిస్ట్ కాగా, ఇందులో నుంచి ఐదు ఫ్రాంఛైజీలు కలిసి అత్యధికంగా 90 మందిని కొనుగోలు చేయబోతున్నారు. ప్రతీ ఫ్రాంఛైజీ పర్సులో రూ.12 కోట్లు ఉంటాయి.

08:46 PM (IST) Feb 13
ముంబై వేదికగా నేటి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఎట్టకేలకు ముగిసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ వేలంలో తొలుత వేలానికి వచ్చిన ప్లేయర్ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఆమెను బెంగళూరు రూ. 3.40 కోట్లతో దక్కించుకుంది. వేలంలోకి చివరగా వచ్చిన ప్లేయర్ సహానా పవార్. సహానా ను కూడా బెంగళూరే దక్కించుకోవడం గమనార్హం. ఆమెకు రూ. 10 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.
08:43 PM (IST) Feb 13
ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, షబ్నమ్ షకీల్
08:43 PM (IST) Feb 13
స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా, డేన్ వన్ నీకర్క్, పూనమ్ ఖేమ్నర్, అశ్విన్ కుమారి, ప్రీతి బోస్, హెథర్ నైట్, మేగన్ షూట్, సహనా పవార్
08:42 PM (IST) Feb 13
హర్మన్ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్, హీలి మాథ్యూస్, హుమైరా కాజి, ప్రియాంక బాలా, చోల్ టైరన్, సోనమ్ యాదవ్, జింతిమని కలిత, నీలం బిష్త్
08:30 PM (IST) Feb 13
తొలి రెండు, మూడు సెట్ లలో ప్లేయర్లను కొనుగోలు చేయడంలో పెద్దగా ఆసక్తి చూపని ఢిల్లీ తర్వాత పుంజుకుంది. మార్కీ సెట్ ప్లేయర్లు ముగిసిన తర్వాత చకచకా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఢిల్లీ 18 మందిని దక్కించుకుంది.
జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్, అపర్ణా మండల్, స్నేహ్ దీప్తి, పూనమ్ యాదవ్, తాన్యా భాటియా, జెస్ జొనాసేన్, అరుందతి రెడ్డి
08:20 PM (IST) Feb 13
డబ్ల్యూపీఎల్ లో యూపీ పర్స్ ఖాళీ అయింది. ఆ టీమ్ ఖాతాలో మిగిలున్న రూ. 10 లక్షలను సిమ్రాన్ షేక్ ను కొనుగోలు చేసింది. పర్స్ ఖాళీ అయ్యాక యూపీ జట్టు ఇలా ఉంది.
సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, సిమ్రాన్ షేక్
నిబంధనల ప్రకారం ఒక జట్టు 15 నుంచి 18 మెంబర్స్ ను తీసుకోవచ్చు. వేలంలో యూపీ 16 మందిని కొనుగోలు చేసింది.
08:10 PM (IST) Feb 13
వెస్టిండీస్ సారథి హేలీ మాథ్యూస్ ను తొలి దశ వేలంలో పట్టించుకోని ఫ్రాంచైజీలు.. తుది దశలో మాత్రం ముంబై రూ. 40 లక్షలకు దక్కించుకుంది. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ హెథర్ నైట్ ను రూ. 40 లక్షలకు సొంతం చేసుకుంది. తాన్యా భాటియా రూ. 30 లక్షలకు ఢిల్లీ తరఫున ఆడనుంది. సుష్మా వర్మ ను రూ. 60 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది.
08:04 PM (IST) Feb 13
ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక ధర దక్కించుకున్న స్మృతి మంధాన (రూ. 3.40 కోట్లు) ఆర్సీబీకి సారథిగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్సీబీ టీమ్ ఇదే.
స్మృతి మంధాన, సోఫీ డివైన్, పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా
08:01 PM (IST) Feb 13
మరో సెషన్ మిగిలిఉన్న వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్లే..
జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్
07:59 PM (IST) Feb 13
డబ్ల్యూపీఎల్ వేలంలో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ టీమ్ కు ఇప్పటివరకు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా..
ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్
07:50 PM (IST) Feb 13
ఇప్పటివరకు ముగిసిన వేలంలో ముంబై కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే..
హర్మన్ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్
07:45 PM (IST) Feb 13
చివరి సెషన్ కంటే ముందు టీమ్ లు, వాటి వద్ద ఉన్న పర్స్ వాల్యూ, స్లాట్ల వివరాలు.. (నిబంధనల ప్రకారం జట్టులో కనీసం 15 మందిని, గరిష్టంగా 18 మందిని తీసుకోవచ్చు)
ఢిల్లీ క్యాపిటల్స్ : మిగిలిన పర్స్ రూ. 2.15 కోట్లు. మరో ముగ్గురిని తీసుకోవచ్చు.
గుజరాత్ : పర్స్ లో రూ. 1.30 కోట్లున్నాయి. ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ఉంది.
ముంబై : పర్స్ లో రూ. 1.30 కోట్లు మిగిలాయి. ఐదుగురిని తీసుకోవచ్చు.
ఆర్సీబీ : పర్స్ లో రూ. 1.95 కోట్లు ఉన్నాయి. నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంది.
యూపీ : పర్స్ లో రూ. 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. 15 మందిని ఎంపిక చేసుకున్నారు.
07:38 PM (IST) Feb 13
డబ్ల్యూపీఎల్ లో యూపీ పర్స్ ఖాళీ అయింది. ఆ టీమ్ ఖాతాలో మరో రూ. 10 లక్షలు మాత్రమే మిగిలాయి. ఆ జట్టును ఓసారి పరిశీలిస్తే..
సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్
మిగిలి ఉన్న నగదు : రూ. 10 లక్షలు
మిగిలిన స్లాట్లు : 3
ఓవర్సీస్ స్లాట్లు : 0
07:31 PM (IST) Feb 13
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ప్రధాన ప్లేయర్ల వేలం ప్రక్రియ ముగియడంతో యాక్షనీర్ డబ్ల్యూపీఎల్ యాక్షన్ వేగం పెంచారు. 45 నిమిషాల విరామం తర్వాత సుమారు 150 మంది ప్లేయర్ల వేలం ముగిసింది. వీరిలో చాలా మంది అన్ సోల్డ్ గానే మిగిలారు. మిగిలిన వారిని మరో 15 నిమిషాల తర్వాత తుది దశ వేలంలో ముగించనున్నారు.
07:20 PM (IST) Feb 13
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో యూపీ వారియర్స్ పర్స్ ఖాళీ అయింది. ఇప్పటికే ఆ జట్టు 15 మందిని కొనుగోలు చేసింది. ఆ జట్టు వద్ద ఇంకా పది లక్షల రూపాయలు మాత్రమే మిగిలాయి. మిగిలిన రూ. 10 లక్షలలో ఆ జట్టు కొనుగోలు చేయాలనుకుంటే మరో ఒక ప్లేయర్ మాత్రమే దక్కనుంది.
07:11 PM (IST) Feb 13
ఆసక్తికరంగా సాగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు అన్ని టీమ్ ల వద్ద మిగిలి ఉన్న నగదు ఇదే..
ఢిల్లీ : రూ. 3.20 కోట్లు
ముంబై : రూ. 2,10 కోట్లు
గుజరాత్ :రూ. 1.50 కోట్లు
బెంగళూరు : రూ. 2.70 కోట్లు
యూపీ : రూ. 20 లక్షలు
07:07 PM (IST) Feb 13
టీమిండియా బ్యాటర్ అమన్ జ్యోత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలకు దక్కించుకుంది. ఢిల్లీ పోటీపడ్డా విఫలమైంది.
07:06 PM (IST) Feb 13
టీమిండియా క్రికెటర్లు అనూజా పాటిల్ తో పాటు సిమ్రాన్ బహదూర్ లు అన్ సోల్డ్ లిస్ట్ లో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్ దేవికా వైద్య ను రూ. 1.40 కోట్లతో యూపీ వారియర్స్ టీమ్ దక్కించుకుంది. దేవికా కోసం యూపీ, ఢిల్లీలు పోటీ పడ్డాయి.
07:01 PM (IST) Feb 13
అలీస్ క్యాప్సీ ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షలకు దక్కించుకోగా ఇసాబెల్లె వాంగ్ ను ముంబై రూ. 30 లక్షలకు, మాన్సీ జోషిని గుజరాత్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్నాయి.
06:57 PM (IST) Feb 13
ఈ ఆసీస్ క్రికెటర్ కోసం గుజరాత్, బెంగళూరులు పోటీ పడ్డాయి. గుజరాత్ జెయింట్స్ జార్జియాను రూ. 75 లక్షలకు దక్కించుకుంది.
06:54 PM (IST) Feb 13
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రేస్ హరీస్ కోసం యూపీ, బెంగళూరు పోటీ పడ్డాయి. చివర్లో ఢిల్లీ కూడా పోటీలోకి వచ్చింది. చివరికి హరీస్ ను రూ. 75 లక్షలకు యూపీ సొంతం చేసుకుంది.
06:49 PM (IST) Feb 13
భారత మహిళా క్రికెటర్లు కిరణ్ నవగిరే ను యూపీ వారియర్స్ రూ. 30 లక్షలకు దక్కించుకుంది. ఆంధ్రా క్రికెటర్ సబ్బినేని మేఘన ను గుజరాత్ జెయింట్స్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.
06:48 PM (IST) Feb 13
ఇప్పటివరకు ముగిసిన వేలంలో టాప్ బిడ్స్ దక్కించుకున్నది వీళ్లే..
- ఈ వేలంలో మొదటి పేరు దక్కిన స్మృతి మంధాన రూ. 3.40 కోట్లతో అందరిలోనూ టాప్ లో నిలిచింది.
- ఆమె తర్వాత భారత ఆటగాళ్లలో దీప్తి శర్మ .. రూ. 2.60 కోట్లతో సెకండ్ హయ్యస్ట్ బిడ్ గా ఉంది.
- విదేశీ ప్లేయర్లలో ఆష్లే గార్డ్నర్ రూ. 3.20 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆమె తర్వాత నటాలీ స్కీవర్ (రూ. 3.20 కోట్లు) తో ఆష్లేతో సమానంగా ఉంది.
06:43 PM (IST) Feb 13
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ప్రధాన ఆటగాళ్ల వేలం ముగిసింది. 45 నిమిషాల విరామం తర్వాత కొద్దిసేపట్లోనే మళ్లీ వేలం ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకూ వివిధ జట్లు 34 మంది క్రికెటర్లను దక్కించుకున్నాయి. వీరిని కొనుగోలు చేయడానికి అన్ని జట్లూ రూ. 43,75,00,000 (43 కోట్ల 75 లక్షలు) లు ఖర్చు చేశాయి. ఇవి పోగా ఏ ఏ జట్టు పర్స్ లో ఎంత నగదు ఉందో ఓసారి చూద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్ : రూ. 3.95 కోట్లు
గుజరాత్ జెయింట్స్ : రూ. 3.75 కోట్లు
ముంబై : రూ. 2.60 కోట్లు
బెంగళూరు : రూ. 3 కోట్లు
యూపీ వారియర్స్ : రూ. 2.95 కోట్లు
05:38 PM (IST) Feb 13
ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఇప్పటివరకు 9 సెట్లు ముగిశాయి. ఏ జట్టు ఎవరిని దక్కించుకుందో ఇక్కడ చూద్దాం.
ఆర్సీబీ : స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్
ముంబై : హర్మన్ప్రీత్, నటాలియా సీవర్, అమిలియా కెర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా
గుజరాత్ జెయింట్స్ : ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, సోఫీయా డంక్లీ, అన్నాబెల్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్
యూపీ వారియర్స్ : సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, తహీలా మెక్గ్రాత్, షబ్నమ్ ఇస్మాయిల్, ఎలీస్సా హేలీ, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్
ఢిల్లీ క్యాపిటల్స్ : జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, శిఖా పాండే, రాధా యాదవ్
05:27 PM (IST) Feb 13
టీమిండియా అండర్ - 19 మహిళల జట్టులో అదరగొట్టిన శ్వేతా సెహ్రావత్ కోసం ఢిల్లీ, గుజరాత్ పోటీ పడ్డాయి. శ్వేతాను రూ. 40 లక్షలతో యూపీ టీమ్ సొంతం చేసుకుంది.
05:25 PM (IST) Feb 13
ఇటీవలే అండర్ - 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన అమ్మాయిలను ఫ్రాంచైజీలు పట్టించుకోవడం లేదు. గ్రేస్ స్క్రీవర్స్ (ఇంగ్లాండ్), అర్చనా దేవి (ఇండియా), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషలకు నిరాశే ఎదురైంది. కానీ తితాస్ సాధు ను ఢిల్లీ.. రూ. 25 లక్షలకు దక్కించుకుంది.
05:22 PM (IST) Feb 13
ఎమర్జింగ్ ప్లేయర్ల వేలం మొదలైంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ హృషితా బసు, సౌమ్య తివారిలకు నిరాశ తప్పలేదు. స్పిన్నర్ పర్షవి చోప్రాను యూపీ వారియర్స్ రూ. 10 లక్షలకు దక్కించుకుంది.
05:15 PM (IST) Feb 13
టీమిండియా స్పిన్నర్ శిఖా పాండే కోసం గుజరాత్, ఢిల్లీ లు పోటీ పడ్డాయి. శిఖాను ఢిల్లీ రూ. 60 లక్షలకు సొంతం చేసుకుంది. మరో స్పిన్నర్ స్నేహ్ రాణా కోసం యూపీ, గుజరాత్ లు పోటీపడగా చివరికి ఆమెను రూ. 75 లక్షలతో తో గుజరాత్ దక్కించుకుంది. మరిజాన్ కాప్ కోసం ఢిల్లీ, బెంగళూరు పోటీపడగా ఢిల్లీ రూ.1.50 కోట్లతో సొంతం చేసుకుంది.
05:11 PM (IST) Feb 13
డబ్ల్యూపీఎల్ వేలంలో భాగంగా ఆల్ రౌండర్లు గ్రూప్ - 2 లో ప్రక్రియలో కూడా ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకురావడం లేదు. భారత స్పిన్నర్ రాధా యాదవ్ ను రూ. 40 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.
04:50 PM (IST) Feb 13
స్పిన్నర్ల కేటగిరీలో చాలా మంది ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ తో పాటు ప్రధాన జట్ల స్పిన్నర్లు అందరూ అన్ సోల్డ్ గానే ఉన్నారు.
04:43 PM (IST) Feb 13
స్పిన్ బౌలర్ల కేటగిరీలో ఇంగ్లాండ్ స్పిన్నర్ సారా గ్లెన్ ను ఎవరూ తీసుకోలేదు. భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ను రూ. 40 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.
04:41 PM (IST) Feb 13
ఈ వేలంలోకి వచ్చిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ జహనర అలమ్ కూడా అమ్ముడుపోలేదు. కివీస్ బౌలర్ లీ తహుహు కూ నిరాశ తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్ అయబొంగ ఖాఖ, విండీస్ బౌలర్ షకీర సల్మాన్ లు అమ్ముడుపోలేదు.
04:34 PM (IST) Feb 13
ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్, మిచెల్ స్టార్క్ భార్య ఎలీస్సా హేలీని యూపీ రూ. 70 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బెర్నాడిన్ కు నిరాశ తప్పలేదు.
04:29 PM (IST) Feb 13
టీమిండియా యువ వికెట్ కీపర్, లేడీ ధోనిగా పేరు దక్కించుకున్న రిచా ఘోష్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. బెంగళూరు, ఢిల్లీ లు పోటాపోటీకి దిగాయి. చివరికి ఆమెను బెంగళూరు రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకుంది.
04:25 PM (IST) Feb 13
టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ యస్తికా భాటియా కోసం యూపీ, గుజరాత్, ముంబై పోటీ పడ్డాయి. యస్తికా చివరికి రూ. 1.50 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది.
04:22 PM (IST) Feb 13
వెస్టిండీస్ క్రికెటర్ డియాండ్రా డాటిన్ ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు టీమ్ కొనుగోలు చేసింది. భారత క్రికెటర్ తాన్యా భాటియా, శ్రీలంక వికెట్ కీపర్ అనుష్క సంజీవనిలను ఎవరూ కొనుగోలు చేయలేదు.
04:18 PM (IST) Feb 13
టీమిండియా ఆల్ రౌండర్ పూజా వస్త్రకార్ కోసం యూపీ, ముంబై పోటీ పడ్డాయి. చివరికి ఆమెను రూ. 1.90 కోట్లకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడనుంది.
04:15 PM (IST) Feb 13
టీమిండియా ఆల్ రౌండర్ హర్లీన్ డియోల్ ను గుజరాత్ జెయింట్స్ రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది.
04:14 PM (IST) Feb 13
శ్రీలంక సారథి చమారి ఆటపట్టును కొనుగోలు చేయడానికి వేలంలో ఏ జట్టూ ముందుకు రాలేదు.