ధోనీ ఫోటో చూపించి కూతురిని టీజ్ చేసిన సాక్షి.. క్యూట్ వీడియో వైరల్

By telugu news teamFirst Published Sep 10, 2020, 9:57 AM IST
Highlights

సాక్షి ఓ క్యూట్ వీడియో షేర్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... జీవా.. తన తండ్రి మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో పట్టుకొని ఉంది. కాగా.. దానిని చూసిన  సాక్షి.. ఈ ఫోటోలో ఉన్నది ఎవరూ నీకు తెలుసా అని అడిగింది. దానికి జీవా వెంటనే నాన్న అంటూ సమాధానం ఇచ్చింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియా కి కాస్త దూరంగానే ఉంటారు. అయితే.. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని.. ఆయన భార్య సాక్షి ధోనీ మాత్రం ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. ధోనీతోపాటు.. వారి ముద్దుల కుమార్తె జీవా ఫోటోలు, వీడియోలు కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా.. సాక్షి ఓ క్యూట్ వీడియో షేర్ చేయగా.. ఆ వీడియో ఇప్పుడు ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... జీవా.. తన తండ్రి మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో పట్టుకొని ఉంది. కాగా.. దానిని చూసిన  సాక్షి.. ఈ ఫోటోలో ఉన్నది ఎవరూ నీకు తెలుసా అని అడిగింది. దానికి జీవా వెంటనే నాన్న అంటూ సమాధానం ఇచ్చింది.

వెంటనే సాక్షి.. ఆర్ యూ షూర్ అని అడగగా... మహేంద్ర సింగ్ ధోనీ అంటూ సమాధానం ఇచ్చింది ముద్దుల జీవా. ఆ వీడియో చాలా క్యూట్ గా ఉంది. దీంతో.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అభిమానులు కూడా వీడియోని తెగ షేర్ చేసుకుంటున్నారు. ధోనీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియో మీరు కూడా ఈ కింద చూడొచ్చు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Papa s biggest fan !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on Sep 9, 2020 at 6:27am PDT

 

click me!