INDvsENG: మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... జో రూట్ అవుట్...

By team teluguFirst Published Mar 4, 2021, 10:44 AM IST
Highlights

30 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్...

సిరాజ్ బౌలింగ్‌లో జో రూట్ అవుట్...

స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరిన ఓపెనర్లు సిబ్లీ, జాక్ క్రావ్లే...

నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు, 30 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 9 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆరో ఓవర్‌లో బంతి అందుకున్న అక్షర్ పటేల్, రెండో బంతికే డొమినిక్ సిబ్లీని పెవిలియన్ చేర్చాడు.

8 బంతుల్లో 2 పరుగులు చేసిన సిబ్లీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 30 బంతుల్లో ఒక ఫోర్‌తో 9 పరుగులు చేసిన జాక్ క్రావ్లే... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.

9 బంతుల్లో ఒక ఫోర్‌తో 5 పరుగులు చేసిన జో రూట్, సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. జానీ బెయిర్‌స్టో 26 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉండగా, బెన్ స్టోక్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 

click me!