ఐపీఎల్ లో కోహ్లీతో వార్.. స్పందించిన సూర్యకుమార్ యాదవ్

By telugu news teamFirst Published May 25, 2021, 10:25 AM IST
Highlights

టార్గెట్ ఛేదనలో తాను గెలిచినట్లుగా పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నా వికెట్ కోసం రెచ్చగొట్టాలని చూశాడని… కాని తాను ప్రశాంతంగా తన పని తాను కానిచ్చాను అని తెలిపాడు.

ఐపీఎల్ లో ఎక్కువ వినపడిన పేరులో సూర్యకుమార్ యాదవ్ ఒకరు. తన ఆట తీరుతో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాడు. కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా మధ్యలోనే రద్దు అయిన సంగతి తెలిసిందే. దానికి ముందు సీజన్ మాత్రం యూఏఈ వేదికగా నిర్వహించారు.

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్​ 13వ సీజన్​లో కోహ్లీతో జరిగిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు యువ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్. విరాట్ స్లెడ్జింగ్​ను తాను ఎంజాయ్​ చేసినట్లు పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్​ ఇన్​స్టా ఖాతాలో లైవ్​ చాట్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు. టార్గెట్ ఛేదనలో తాను గెలిచినట్లుగా పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నా వికెట్ కోసం రెచ్చగొట్టాలని చూశాడని… కాని తాను ప్రశాంతంగా తన పని తాను కానిచ్చాను అని తెలిపాడు. అతడు నన్ను మాత్రమే కాదు.. ఆ సమయంలో ఎవరినైనా అలానే చేసేవాడేమో. విరాట్ నన్ను స్లెడ్జ్​ చేసినందుకు సంతోషంగా అనిపించింది.

నేను గొప్పగా ఆడుతున్నాను కాబట్టే నా వికెట్ కోసం నన్ను కవ్వించే ప్రయత్నం చేశాడు. అదే జరిగితే రన్​రేట్ మందగించి మేము ఓడిపోయే అవకాశం ఉండేదని వెల్లడించాడు. మ్యాచ్​ తర్వాత అంతా మాములుగా ఉందని సూర్య తెలిపాడు. మైదానంలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని పేర్కొన్నాడు. “గ్రౌండ్​లో ఉన్నప్పుడు నేను కూల్​గా ఉంటాను. వివాదాల జోలికి వెళ్లను” అని యాదవ్ స్పష్టం చేశాడు.ఆనాడు.. ముంబయి, బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్​లో రోహిత్ సేన గెలుపొందింది. ఈ మ్యాచ్​లో సూర్యకుమార్ 79 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టుకు విజయాన్ని అందించాడు.

click me!