భారత్ లో 24గంటల్లో 508 కొత్త కేసులు..124 మరణాలు

Published : Apr 08, 2020, 08:07 AM IST
భారత్ లో 24గంటల్లో 508 కొత్త కేసులు..124 మరణాలు

సారాంశం

మహారాష్ట్రలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. ఇవాళ ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం ఒక వెయ్యి 18 కేసులు నమోదయ్యయి. కరోనాతో మహారాష్ట్రలో 48 మంది మృతి చెందారు.   

కరోనా మహమ్మారి భారత్ లో రోజురోజుకీ విజృంభిస్తోంది. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో వారంలో లాక్ డౌన్ ముగియనుండగా.. ఈ నేపథ్యంలో మరెన్ని కొత్త కేసులు నమోదౌతాయోనని ప్రజలు భయపడిపోతున్నారు.

Also Read తెలంగాణాలో 400 దాటినా కరోనా కేసులు, హైదరాబాద్ లోనే 170 కేసులు!...

ఇదిలా ఉండగా...ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4789 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...4312 యాక్టీవ్ కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 124 మంది మృతి చెందగా 353 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడచిన 24 గంటల్లో 508 కొత్త కేసులు కాగా 13 మంది ప్రాణాలు కొల్పోయారు.

మహారాష్ట్రలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. ఇవాళ ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం ఒక వెయ్యి 18 కేసులు నమోదయ్యయి. కరోనాతో మహారాష్ట్రలో 48 మంది మృతి చెందారు. 

ముంబయి నగరంలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కేవలం ముంబయి నగరంలోనే ఇవాళ 100 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్కడ ఇప్పటి వరకువ  మొత్తం 590 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. ఒక్క ఈ నగరంలోనే కరోనా సోకి 40మంది ప్రాణాలు కోల్పోయారు.
 

PREV
click me!

Recommended Stories

భారత్‌లోకి ఎంటరైన కరోనా కొత్త వేరియంట్.. మహారాష్ట్రలో వెలుగులోకి , లక్షణాలివే
భారత్ లో కోవిడ్ విజృంభణ.. ఒకే రోజు 2,151 కొత్త కేసులు.. ఐదు నెలల్లో అత్యధికం