పోర్స్చే ఇండియా డైరెక్టర్‌ పదవికి పవన్‌ శెట్టి గుడ్ బై..వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా..

By Sandra Ashok KumarFirst Published Jul 2, 2020, 5:15 PM IST
Highlights

వ్యక్తిగత కారణాలతోనే రెండు రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేసినట్లు పవన్‌ శెట్టి  వెల్లడించారు. అతని తరువాత కంపెనీ డైరెక్టర్  పదవిని ఎవరు పొందుతారు అనేది ఇంకా ప్రకటించలేదు. 

ముంబయి: వ్యక్తిగత కారణాలను చూపిస్తూ పోర్స్చే ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.  వ్యక్తిగత కారణాలతోనే రెండు రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేసినట్లు పవన్‌ శెట్టి  వెల్లడించారు. అతని తరువాత కంపెనీ డైరెక్టర్  పదవిని ఎవరు పొందుతారు అనేది ఇంకా ప్రకటించలేదు.

అప్పటివరకూ పోర్స్చే ఇండియా సేల్స్ హెడ్ ఆశిష్ కౌల్ రోజువారీ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అతను నేరుగా స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుర్ప్రతాప్ బొపరాయ్కు నేరుగా నివేదిస్తాడు. ఇంతకుముందు పోర్స్చే అనుబంధ బ్రాండ్ లంబోర్ఘిని ఇండియాకు పవన్ శెట్టి నాయకత్వం వహించాడు.

తరువాత పోర్స్చే ఇండియాకి డైరెక్టర్ గా 2016 జనవరి నుండి బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే కొత్త డైరెక్టర్ ఎవరనేది ప్రకటన చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. పవన్ శెట్టి పోర్స్చే ఇండియా అధిపతిగా, సేల్స్, మార్కెటింగ్ తరువాత నెట్‌వర్క్ అభివృద్ధి వంటి విధులను పర్యవేక్షించారు.

also read   

అతను దేశంలో బ్రాండ్ ఉనికిని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అన్నీ-ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో ప్రారంభించటానికి పవన్ శెట్టి ముందుకొచ్చాడు. పోర్స్చే  గ్లోబల్ లైనప్ నుండి కొత్త ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో పవన్ కీలక పాత్ర పోషించారు.

అతను 2000 లో హెచ్‌ఎస్‌బిసిలో తన వృత్తిని ప్రారంభించినప్పటికీ, రెండు దశాబ్దాల పాటు ఆటోమోటివ్ పరిశ్రమలో గడిపాడు.అతను 2012 లో వోక్స్వ్యాగన్ గ్రూపులోని ఇండియా హెడ్ ఆఫ్ ఇటాలియన్ కార్ మేకర్ సంస్థ లంబోర్ఘినిలో చేరడానికి ముందు కాస్ట్రోల్, టాటా మోటార్స్, ఫోర్డ్ వంటి సంస్థలతో కలిసి పనిచేశాడు.

వోక్స్‌ వ్యాగన్, స్కోడా, ఆడి, పోర్స్చే, లంబోర్గిని బ్రాండ్లు అన్నీ భారతదేశంలోని వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌నకు చెందినవే. 
 

click me!