FY19: లక్ష దాటిన మారుతి‘సెలేరియో’ అమ్మకాలు

By rajesh yFirst Published Apr 13, 2019, 12:51 PM IST
Highlights

దేశీయ ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. 2014లో విపణిలో అడుగు పెట్టిన ‘సెలెరియో’ మోడల్ కంపాక్ట్ కారు విక్రయాలు గతేడాది లక్ష యూనిట్ల విక్రయ లక్ష్యాన్ని దాటాయి.

న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కంపాక్ట్‌ మోడల్‌‌ మారుతి సుజుకి ‘సెలేరియో’ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో లక్ష మార్క్‌ను దాటాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,03,734 సెలేరియో వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ తెలిపింది.

తొలిసారి ఈ మోడల్‌ను మారుతి సుజుకి 2014లో భారత విపణిలో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 4.7 లక్షల యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కంపాక్ట్‌ మోడల్‌ అమ్మకాలు 10 శాతం మేర పెరిగాయి. 

ఈ కంపాక్ట్‌ మోడల్ ఆటో గేర్‌ షిఫ్ట్‌ సాంకేతికతో దేశీయంగా మార్కెట్‌లోకి విడుదలైన మొదటి కారు అని తెలిపింది. అందునా ఈ మధ్యకాలంలో ఆ కారు ప్రయాణంలో సేఫ్టీ కోసం పలు మార్పులతో ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్లు ఎంఎస్‌ఐ మార్కెటింగ్‌, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్. కల్సీ పేర్కొన్నారు. 

ఈ కంపాక్ట్‌ మోడల్‌లో అమర్చిన పెట్రోల్‌ ఇంజిన్ సాయంతో ఆటో గేర్‌ షిఫ్ట్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ రెండు వేరియంట్లలోనూ ఒక లీటర్‌ పెట్రోల్‌తో 23.1 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సీఎన్‌జీ వేరియంట్లలో ఈ ఫ్యూయల్‌ ఎఫీషియెన్సీ 31.76 కిలోమీటర్లుగా ఉన్నట్లు ఎంఎస్‌ఐ ప్రకటించింది. మారుతి సుజుకి బ్రాండ్‌కు చెందిన విటారా, బ్రెజ్జా, డిజైర్, బలేనో, స్విఫ్ట్‌, వేగనార్‌, ఆల్టో తదితర మోడళ్లు ఇప్పటికే లక్ష మార్క్‌ దాటిన జాబితాలో ఉన్నాయి.
 

click me!