బంగారం, వెండి ధరలకు రష్యా ‘ వ్యాక్సిన్‌’ బ్రేకులు..

Ashok Kumar   | Asianet News
Published : Aug 13, 2020, 02:20 PM ISTUpdated : Aug 13, 2020, 10:44 PM IST
బంగారం, వెండి ధరలకు రష్యా ‘ వ్యాక్సిన్‌’ బ్రేకులు..

సారాంశం

గత శుక్రవారం బంగారం ధరలు రికార్డు స్థాయిలో పది గ్రాములకు రూ.56,000కి  పెరిగింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యా కరోనా వైరస్ వ్యాక్సిన్ సంబంధించి వార్తను తెలియజేయడంతో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి.

భారతదేశంలో బంగారు ధరలు రెండు రోజులలో 10 గ్రాములకు దాదాపు 5వేలు తగ్గి, వెండి కిలోకు 14 వేలు తగ్గింది. ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్స్ ఎంసిఎక్స్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.50,502 వద్ద ట్రేడవుతున్నాయి, ఈ రోజు రూ.49,955 కనిష్టానికి తాకానుంది, సిల్వర్ ఫ్యూచర్స్ వెండి కిలో ధర రూ.62,275 వద్ద ఉంది.

గత శుక్రవారం బంగారం ధరలు రికార్డు స్థాయిలో పది గ్రాములకు రూ.56,000కి  పెరిగింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యా కరోనా వైరస్ వ్యాక్సిన్ సంబంధించి వార్తను తెలియజేయడంతో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి.

"ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించిన తరువాత బంగారం ధరల డిమాండ్ కోల్పోయింది. కోలుకుంటున్న యుఎస్ డాలర్, ఈక్విటీలలో లాభాలు కూడా సురక్షితమైన పెట్టుబడి  బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చాయి.

ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభణ, కోవిడ్‌ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి,  అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. 

also read భార్యకు గిఫ్ట్ ఇచ్చిన ముకేష్ అంబానీ.. అదేంటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. ...

గ్లోబల్ మార్కెట్లలో బంగారం ఔన్సు  1,900 డాలర్ల కంటే తక్కువ స్థాయికి పడిపోయింది, ఎందుకంటే డాలర్ పెట్టుబడిదారుల రికార్డులను అధిగమించటానికి ప్రేరేపించింది. అంతకు ముందు స్పాట్ బంగారం 6% పడిపోయిన తరువాత  నేడు మూడు వారాల కనిష్ట స్థాయి 1,872.19 డాలర్లకు చేరుకొని 2% క్షీణించింది.


 వెండి కూడా ఔన్స్‌కు 2.8% పడిపోయి 24.11 డాలర్లకు పడిపోయింది. గత శుక్రవారం  7వ తేదీన ట్రేడింగ్‌ చివర సమయాల్లో బంగారం పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్‌ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించడం బంగారం ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి.

ఐఎఫ్ఎ గ్లోబల్ వ్యవస్థాపకుడు, సిఇఒ అభిషేక్ గోయెంకా "రష్యా తన మొదటి కరోనా వైరస్ టీకా సంబంధించిన న్యూస్ రిస్క్ సెంటిమెంట్ను పెంచింది. యుఎస్ కోర్ పిపిఐ ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగింది. సురక్షితమైన యుఎస్ ట్రెషరీ, జర్మన్ బండ్లు అమ్ముడయ్యాయి. యుఎస్ రియల్ రేట్ల పెరుగుదలతో బంగారం కూడా గణనీయంగా పెరిగింది. " అన్నారు.

బంగారు ధరలలో తగ్గుదల ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధర 25% పెరిగింది, ఎందుకంటే కరోనా వైరస్ మందగమనం, కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థ కరెన్సీ క్షీణత భయాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు లోహాన్ని హెడ్జ్‌గా కొనుగోలు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Sangeetha 52nd Anniversary Sale: సంగీత 52వ వార్షికోత్సవ సేల్ షురూ.. అదిరిపోయే ఆఫర్లు బాస్ !
SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!