ప్రయాణికులకు క్రిస్మస్ బంపర్ అఫర్: టికెట్ ధరల పై భారీ తగ్గింపు..

Published : Dec 21, 2023, 02:48 PM ISTUpdated : Dec 21, 2023, 02:52 PM IST
ప్రయాణికులకు క్రిస్మస్ బంపర్ అఫర్: టికెట్ ధరల పై భారీ తగ్గింపు..

సారాంశం

ఈ పండుగ ఆఫర్‌  సద్వివినియోగం చేసుకోవాలని టికెట్ బుక్ చేసుకునే అవకాశం డిసెంబర్ 23 వరకు మాత్రమే. అదే సమయంలో, సెప్టెంబర్ 30, 2024 లోపు ప్రయాణించాలనుకునే తేదీలపై టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 

డిసెంబర్ కూడా పెళ్లిళ్ల సీజన్. చాలా మంది ఈ మాసంలో పిల్లలు ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటుంటారు . క్రిస్మస్ సందర్భంగా విస్తారా ఎయిర్‌లైన్స్  ప్రయాణీకులకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ వ్యవధి డిసెంబర్ 21 నుండి అంటే నేటి నుండి డిసెంబర్ 23 వరకు. 

విస్తారా ఎయిర్‌లైన్స్ ఎకానమీ క్లాస్‌కు రూ. 1924, ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ. 2324 ఇంకా బిజినెస్ క్లాస్‌కు రూ. 9924 నుండి ధరలను అందిస్తోంది. 

విస్తారా ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి ఇంకా మారిషస్‌లకు అండ్  రిటర్న్ ప్రయాణాలపై తగ్గింపులను అందిస్తుంది. 

ఈ పండుగ ఆఫర్‌  సద్వివినియోగం చేసుకోవాలని టికెట్ బుక్ చేసుకునే అవకాశం డిసెంబర్ 23 వరకు మాత్రమే. అదే సమయంలో, సెప్టెంబర్ 30, 2024 లోపు ప్రయాణించాలనుకునే తేదీలపై టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 21న 00:01 నుండి డిసెంబర్ 23న 23:59 వరకు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయం కేటాయించారు. 

ఈ రోజు బుకింగ్ విండో తెరవడంతో ప్రయాణికులు హాలిడేస్, ఫ్యామిలీ  టూర్  లేదా బిజినెస్  టూర్ ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి మంచి అవకాశం అందిస్తుంది.  

విస్తారా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లు, ATOలు, కాల్ సెంటర్‌లు, OTAలు లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా  టికెట్ బుకింగ్‌లు చేయవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Post office: మీరు ఏం చేయకపోయినా రూ. 2 లక్షలు మీ సొంతం.. ఈ పథకం గురించి తెలుసా.?
Business Ideas: ప‌నికి రాని పాత వైర్లతో ల‌క్ష‌ల సంపాద‌న‌.. మీ జీవితాన్ని మార్చే బిజినెస్‌