
నేడు మార్చి 15 బుధవారం ఇంధన ధరలు మారలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి ఇంకా సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు, వాల్యు ఆధారిత పన్ను (VAT) వంటి వివిధ కారకాలపై ఆధారపడి ఉంటాయి. 2022 మేలో పెట్రోల్పై లీటరుకు రూ.8, డీజిల్పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారిగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.
కోల్కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉంది.
నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.89.96.
గురుగ్రామ్: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.18, డీజిల్ ధర: రూ. 90.05
చండీగఢ్: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర: రూ. 84.26
హైదరాబాద్
పెట్రోలు: లీటరుకు రూ. 109.66
డీజిల్: లీటరుకు రూ. 97.82
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0058 GMT నాటికి బ్యారెల్కు 62 సెంట్లు లేదా 0.8% పెరిగి $78.07 డాలర్లకి చేరుకుంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ (WTI) బ్యారెల్కు 70 సెంట్లు లేదా 1.0% లాభపడి $72.03డాలర్లకి చేరుకుంది. మంగళవారం, బెంచ్మార్క్లు మూడు నెలల కనిష్టానికి 4% కంటే ఎక్కువ పడిపోయాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరలు మరియు ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా రోజువారీ ధరలను సవరిస్తాయి.