todays fuel prices:నేడు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. 6 నెలల కనిష్టానికి అంతర్జాతీయ చమురు..

Published : Aug 19, 2022, 08:57 AM ISTUpdated : Aug 19, 2022, 08:59 AM IST
todays fuel prices:నేడు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు..  6 నెలల కనిష్టానికి అంతర్జాతీయ  చమురు..

సారాంశం

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24. బెంగళూరులో ఈరోజు పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

 
నేడు మహారాష్ట్ర మినహా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు వరుస 3 నెలలుగా స్థిరంగా ఉన్నాయి. జూలై 15న మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై లీటరుకు రూ. 5, డీజిల్‌పై లీటరుకు రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించింది. ఈ చర్య వల్ల ఆ  రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.6,000 కోట్ల భారం పడనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి ప్రముఖ నగరాల్లో ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించలేదు.
ఢిల్లీలో ఎక్సైజ్ సుంకం తగ్గింపు ముందు గతంలో లీటరుకు రూ.105.41గా ఉన్న పెట్రోల్ ధర నేడు రూ.96.72గా ఉంది, డీజిల్ ధర కూడా లీటరుకు రూ.96.67గా నుండి రూ.89.62గా ఉంది. ఈరోజు ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31 ఉండగా, ముంబైలో డీజిల్ ధర లీటరుకు రూ.94.27గా ఉంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24. బెంగళూరులో ఈరోజు పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

భారతదేశం ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపై ఆధారపడి ఉంది. అందుకే ముడిచమురు ధరలు పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వ పన్నులు, రూపాయి-డాలర్ క్షీణత అండ్ రిఫైనరీ కాన్సెప్ట్ నిష్పత్తి వంటి ఇతర అంశాలు కూడా దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపుతాయి.

భారతదేశంలో స్థానిక పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీల ఆధారంగా పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. అంతేకాకుండా కేంద్రం రెండు ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?