2 నెలల్లో 48 బిలియన్లకు పడిపోయినా ముఖేష్ అంబానీ సంపద...

By Sandra Ashok KumarFirst Published Apr 6, 2020, 4:13 PM IST
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అతని సంపద 19 బిలియన్ డాలర్లకు పడిపోయింది.గౌతమ్ అదానీ సంపద 6 బిలియన్ డాలర్లు లేదా 37 శాతం క్షీణించింది, అలాగే హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ నాదర్ 5 బిలియన్ డాలర్లు లేదా 26 శాతం, బ్యాంకర్ ఉదయ్ కోటక్ సంపద 4 బిలియన్ డాలర్లు లేదా 28 శాతం క్షీణించిందని తెలిపింది.
 

ముంబై: స్టాక్ మార్కెట్లలో భారీగా దిద్దుబాటు కారణంగా భారతీయ ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద రెండు నెలల పాటు రోజుకు 28 శాతం లేదా 300 మిలియన్ డాలర్లు తగ్గి 48 బిలియన్ డాలర్లకు చేరుకుందని సోమవారం ఒక నివేదిక తెలిపింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంపద 19 బిలియన్ డాలర్లకు క్షీణించిందని, ప్రపంచ ర్యాంకింగ్ లో ఎనిమిది స్థానాలను తగ్గి 17వ స్థానానికి చేరుకుందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తెలిపింది.

గౌతమ్ అదానీ సంపద 6 బిలియన్ డాలర్లు లేదా 37 శాతం క్షీణించింది, అలాగే హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ నాదర్ 5 బిలియన్ డాలర్లు లేదా 26 శాతం, బ్యాంకర్ ఉదయ్ కోటక్ సంపద 4 బిలియన్ డాలర్లు లేదా 28 శాతం క్షీణించిందని తెలిపింది.ఈ ముగ్గురూ టాప్ 100 జాబితా నుండీ తప్పుకున్నారు, మిస్టర్ ముఖేష్  అంబానీ మాత్రం లీగ్‌లో ఉన్న ఏకైక భారతీయుడిగా నిలిచారు.

"అమెరికా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు స్టాక్ మార్కెట్లలో 26 శాతం తగ్గి, యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5.2 శాతం పడిపోయింది.ముఖేష్ అంబానీ సంపద 28 శాతం తగ్గిందని హురున్ రిపోర్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహ్మాన్ అన్నారు.
 

click me!