
నేటి నుంచి చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.7 పెరిగింది. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు మారుస్తుంటాయి. ఇందులో గత నెల జూన్ 1న కూడా మార్పుల్లో భాగంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.83 తగ్గింది.
కానీ 4 రోజుల తర్వాత, ఈసారి చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరను ఈ రోజు అంటే జూలై 4 న పెంచాయి. ఈసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై రూ.7 చొప్పున పెంచాయి.
ANI వార్తా సంస్థ నివేదిక ప్రకారం, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రాజధాని ఢిల్లీలో రూ. 1,780కి అందుబాటులో రానుంది. అంటే, ఇప్పుడు దీని కోసం మీరు మునుపటి కంటే రూ.7 ఎక్కువ చెల్లించాలి. కొత్త ధరను ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లో విడుదల చేయలేదు. దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని వార్తా సంస్థ తెలిపింది. ఇది ఢిల్లీలో పాత ధర రూ.1103 వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నాలుగు నెలల తర్వాత ధర పెరిగింది
గత నాలుగు నెలలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను నిరంతరం తగ్గిస్తూ వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి. కానీ నేడు ధర పెరిగింది. 1 మార్చి 2023న సిలిండర్ ధర రూ. 2119.50. ఆ తర్వాత ఏప్రిల్లో రూ.2028కి తగ్గగా, మేలో రూ.1856.50గా, జూన్ 1న రూ.1773కి చేరింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత మరోసారి వాణిజ్య సిలిండర్ ధర 7 రూపాయలు పెరిగింది.
వాణిజ్య సిలిండర్ ఎక్కువగా హోటల్స్ లోను రెస్టారెంట్లలోను ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. ఫలితంగా వ్యాపారులపై ఇది అదనపు భారంగా మారే అవకాశం ఉంది. సాధారణ సిలిండర్ కన్నా కూడా వాణిజ్యసిలిండర్ పరిమాణంలో కూడా పెద్దది సాధారణ సిలిండర్ 15 కిలోల పరిమాణంలో ఉంటుంది. అదే వాణిజ్య సిలిండర్ 19 కిలోల పరిమాణంలో ఉంటుంది.
ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం 75 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. డబ్ల్యూటిఐ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా అలాగే రష్యా తమ ఆయిల్ వెలికితీత కార్యకలాపాలను పరిమితం చేయనున్న నేపథ్యంలో భవిష్యత్తులో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వెలికితీత కార్యక్రమాలను భారీగా పెంచనున్న నేపథ్యంలో ధరలను నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.